రేవంత్రెడ్డి అనుకున్నట్టుగానే ఎంతో కష్టపడి, ప్లాన్ వేసి మరీ కాంగ్రెస్ పగ్గాలు చేజిక్కించుకున్నారు.కానీ ఆయన ఇలా బాద్యతలు తీసుకున్నారో లేదో సీనియర్లు నిరసన గళం పెంచారు.
ఇంకా కొందరైతే ఏకంగా పార్టీకి రాజీనామాలు కూడా చేస్తున్నారు.అయితే రేవంత్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు.
ఇక ఆయనకు మొదటి సారి ఎదురవుతున్న పెద్ద సవాల్ హుజూరాబాద్ ఉప ఎన్నిక.అయితే మొదటి నుంచి ఇక్కడే అభ్యర్థిగా ప్రకటించుకుని ప్రచారం చేస్తున్న కౌశిక్రెడ్డి అనూహ్యంగా ఆయన ఫోన్ కాల్ లీక్ కావడంతో పెద్ద దుమారమే రేగింది.
అందులో ఆయనకు టీఆర్ ఎస్ టికెట్ కన్ఫర్మ్ అయిందని, చెప్పడం వెంటనే కాంగ్రెస్ నోటీసులు ఇవ్వడం, ఇక ఆయనకూడా పార్టీకి రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి.ఇక ఆయన ఇప్పుడు టీఆర్ ఎస్లో చేరి అక్కడి నుంచే పోటీ చేసే అవకాశం ఉంది.
ఇక కాంగ్రెస్ విషయంలో రేవంత్ మళ్లీ టెన్షన్ పడుతున్నారు.ఆయన మదిలో ఉన్న పొన్నప్రభాకర్కు ఇస్తే విమర్శలు వస్తాయనే అభిప్రాయంతో ఆయన వెనకడుగు వేస్తున్నారు.
ఇంకోవైపు టీఆర్ ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించలేదు.ఈ నేపథ్యంలో తాము ప్రకటిస్తే ప్రమాదమే అని అనుకుంటున్నారు.
ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటిస్తే టీఆర్ ఎస్ లాగేసుకుంటుందేమో అని రేవంత్ భావిస్తున్నారు.ఈ మేరకు టీఆర్ ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే తమ అభ్యర్థిని ప్రటించాలని రేవంత్ భావిస్తున్నారు.అప్పుడైతేనే ఎలాంటి టెన్షన్ ఉండదని కాంగ్రెస్ బాస్ అనుకుంటున్నారు.కాకపోతే ఇందులో టీఆర్ ఎస్ కూడా కావాలనే అభ్యర్థిని ప్రకటించకుండానే ప్రచారం చేయడాన్ని బట్టి చూస్తుంటే పెద్ద ప్లానే వేసినట్టు కనిపిస్తోంది.
మరి టీఆర్ ఎస్ వలలో రేవంత్ పడుతారా లేక చాణక్యుడిలా ఎదుర్కొంటారా అన్నది మాత్రం చూడాలి.