వాస్తవానికి తెలంగాణలో కంటే కూడా ఏపీలోనే కులాల రాజకీయాలు చాలా వాడీ వేఢీగా సాగుతుంటాయి.అక్కడ కుల ప్రస్తావన లేని రాజకీయాలను అస్సలు ఊహించలేం.
ఎందుకంటే కులాల పట్టింపు ఏపీలో చాలా ఎక్కువగా ఉంటుంది.అందుకే కొన్ని బలమైన కులాలు సపోర్టు చేస్తే గనక ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చేస్తుంది.
ఇప్పటికే ఈ విషయం ఎన్నోసార్లు నిరూపితమయింది.ఒకసారి టీడీపీని చూస్తేనే ఈ విషయం అర్థమయిపోతుంది.
ఆ పార్టీ గతంలో కాపు, కమ్మతో పాటు బీసీ వర్గాలకు పెద్ద పీట వేసి అధికారంలోకి వచ్చేసింది.
ఏపీలో బలంగా ఉంటున్న కాపు, కమ్మ వర్గాల సపోర్టు గతంలో టీడీపీకే ఉండేది.
కానీ ఆ తర్వాత జగన్ ఎంట్రీతో సీన్ మారిపోయింది.ఆయన ఆ రెండు వర్గాలతో పాటు బీసీలను కూడా తనవైపు తిప్పేసుకున్నారు.
ఇప్పుడు ఆయన బలంగా ఉన్నారు.ఇంకా చెప్పాలంటే ఏపీలో అసలు జగన్ను దెబ్బ కొట్టాలంటే ఏ పార్టీకి సాధ్యం అయ్యేలా లేదు.
ఆయన ఎవరికీ అందనంత ఎత్తులో బలమైన నేతగా ముద్ర వేసేసుకున్నారు.దీంతో అటు టీడీపీతో పాటు జనసేన జగన్ ను గద్దె దించేందుకు బాగానే ప్రయత్నిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఈ రెండు పార్టీల పొత్తు అంశం తెరమీదకు వచ్చేసింది.ఈ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎలాగైనా పొత్తు పెట్టుకుని కమ్మ, కాపు సామాజిక వర్గాలను ఒక్క తాటి మీదకు తెస్తే ఈజీగా జగన్ ప్రభావాన్ని తగ్గించొచ్చని అంటున్నారు ఈ రెండు పార్టీల కార్యకర్తలు.ఈ రెండు సామాజిక వర్గాల ఓట్లు ఏపీలో చాలా ఎక్కువగా ఉన్నాయి.
కాబట్టి ఆ ఓట్లను గంప గుత్తగా రాబట్టుకుంటే గనక తమకు తిరుగుండదని భావిస్తున్నారంట ఈ రెండు పార్టీల నేతలు.ఇందుకోసం ఇప్పటికే అడుగులు కూడా పడుతున్నాయని తెలుస్తోంది.
చూడాలి మరి ఏం జరుగుతుందో.
.