హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ లీడర్ కౌశిక్ రెడ్డి ఏం చేయబోతున్నాడా అని అందరిలో సందేహాలు నెలకొన్నాయి.కాంగ్రెస్ నుంచి బయటకు రావడంతో పాటు ఆ పార్టీ నేతలపై కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
పార్టీని విడిచిపెట్టాలని కానీ ఇలా విమర్శలు చేయడం బాగోదని అంటున్నారు.హుజురాబాద్ ఏరియాలో కూడా కౌశిక్ రెడ్డి పలుకుబడి తగ్గిందని పెదవి విరుస్తున్నారు.
ఇదే నివేదికను స్థానిక టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ కు పోస్ట్ చేశారని సమాచారం.దీనిపై టీఆర్ఎస్ పెద్దలు కూడా పునరాలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒక వేళ కౌశిక్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెడితే ఎంత వరకు ప్రయోజనం ఉంటుందనే విషయం పై మల్లగుల్లాలు పడుతున్నారు.తాజా పరిణామాలు ప్రత్యర్థి అయిన ఈటల రాజేందర్ కు లాభిస్తాయని జోస్యం చెబుతున్నారు.
కౌశిక్ రెడ్డి ఎంపీ, మాజీ పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి తమ్ముడవడం వల్లే ఇన్ని రోజులు ఆయనకు కాంగ్రెస్ లో చోటు దక్కిందని అంటున్నారు.
రాజీనామా స్టెప్ తర్వాత కౌశిక్ రెడ్డి ఎటు వైపుకు అడుగులు వేస్తాడని అందరూ నిశితంగా గమనిస్తున్నారు.
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఆయనకు టీఆర్ఎస్ తరఫున టికెట్ రావడం గగనమే అంటున్నారు.టికెట్ గురించిన నిర్ణయాన్ని సీఎం చూసుకుంటాడని స్థానిక నేతలు చెబుతున్నారు.
మరికొంత మంది మాత్రం ఆయన క్రికెట్ బాగా ఆడుతాడు కాబట్టి నామినేటెడ్ పోస్ట్ అయిన శాప్ చైర్మన్ పదవి దక్కుంతదనే అభిప్రాయాన్ని వెలి బుచ్చుతున్నారు.కాంగ్రెస్ నేతలు మాత్రం కౌశిక్ రెడ్డి కి గత హుజురాబాద్ ఎమ్మెల్యే ఎన్నికల్లో పోలైన ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీని చూసే వేసారని కౌశిక్ రెడ్డి చరిష్మాతో ఒరిగిందేమీ లేదని అంటున్నారు.ఆయన కాంగ్రెస్ నాయకులపై చేసిన వ్యాఖ్యల పై తీవ్ర అసహనంతో ఉన్నారు.