ఇటీవల జబర్దస్త్ షోలో కామెడీ స్కిట్లలో నటించేటువంటి దొరబాబు మరియు పరదేశి అనే ఇద్దరు కమెడియన్లు విశాఖపట్నంలో వ్యభిచారం నిర్వహిస్తున్నటువంటి గృహంలోపోలీసులకి పట్టుబడిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ జబర్దస్త్ కామెడీ షోలో తనదైన శైలిలో పంచులు వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునేటువంటి హైపర్ ఆదిపై పడినట్లు తెలుస్తోంది.
ఎందుకంటే దొరబాబు మరియు పరదేశి ప్రస్తుతం హైపర్ ఆది టీం లోనే పనిచేస్తున్నారు.
అయితే ఈ విషయం గురించి ప్రస్తుతం నెట్టింట్లో పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇందులో ముఖ్యంగా దొరబాబు మరియు పరదేశి పోలీసులకి పట్టుబడినప్పటినుంచి హైపర్ ఆది టాలీవుడ్ లోని పలువురు ప్రముఖుల నుంచి ప్రశ్నలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.అంతేగాక జబర్దస్త్ షో నిర్వాహకులు కూడా హైపర్ ఆదిని పిలిచి ఈ విషయంపై విచారించినట్లు తెలుస్తోంది.
అంతేకాక మరి కొంతమంది అయితే కమెడియన్ దొరబాబు చేసినటువంటి నిర్వాకంతో హైపర్ ఆది టీం ని పూర్తిగా జబర్దస్త్ నుంచి తొలగించినట్లు చర్చించుకుంటున్నారు.అయితే మరి ఈ విషయంపై హైపర్ ఆది కానీ జబర్దస్త్ షో నిర్వాహకులు కానీ స్పందించడం లేదు.
అయితే దొరబాబు విషయంపై హైపర్ ఆది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాక యూట్యూబ్ లో చిన్నచిన్న వీడియోలు చేసుకుంటూ ఉన్నటువంటి దొరబాబుని తీసుకువచ్చి జబర్దస్త్ లో మంచి లైఫ్ ఇచ్చాడని అటువంటిది ఇలాంటి పనులు చేస్తూ హైపర్ ఆది టీం కి మచ్చ తెచ్చాడని మండి పడుతున్నారు.
తాజా వార్తలు