సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసిన ‘ఆదిపురుష్( Adipurush )’ చిత్రం గురించే చర్చ.ఈ సినిమా ఈ నెల 16 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదల కాబోతుంది.
రీసెంట్ గానే విన్నూతన రీతిలో తిరుపతి లో జరిపిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.అప్పటి నుండి ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్.
ఈ చిత్రం హోల్ సేల్ గా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ టీ సిరీస్ నుండి 180 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.ఎప్పుడైతే ఈ సినిమాని ఆ సంస్థ కొనుగోలు చేసిందో, అప్పటి నుండి ఈ సినిమాకి మహర్దశ పట్టుకుంది.
అంతకు ముందు ఈ సినిమా విడుదల అవుతుంది అనే వార్త చాలా మందికి తెలియదు, కానీ ఈ సంస్థ చేతికి ఆదిపురుష్ వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న ప్రొమోషన్స్ తో సినిమాకి ఎక్కడలేని హైప్ వచ్చేసింది, ఇప్పుడు ఎక్కడ చూసిన ‘ఆదిపురుష్’ నామ జపాన్ని చేసేలా చేసారు నిర్మాతలు.
ఇకపోతే ఈ సినిమా గురించి రోజుకి ఒక్క ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియా( Social media ) లో బయటకి వస్తుంది.ఈ సినిమాలో హనుమంతుడి పాత్ర ని ప్రముఖ మలయాళీ నటుడు దేవదత్త నటించాడు.ట్రైలర్ లో ఆయన లుక్ ని చూస్తూ ఉంటే సాక్ష్యాత్తు ఆంజనేయస్వామి వచ్చి వెండితెర మీద కనిపించాడా అన్నట్టుగా అనిపిస్తుంది.
అంత సహజంగా ఈ సినిమాలో ఆయన కనిపించాడు.ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఈయన గురించి ప్రభాస్ ప్రత్యేకించి మాట్లాడాడు.ఇదంతా పక్కన పెడితే ఈ పాత్ర ఎంపిక కోసం ఎంతో మంది హీరోలను సంప్రదించారట, అందులో దగ్గుపాటి రానా( Rana Daggubati ) కూడా ఒకడు అని తెలుస్తుంది.ఆయన శరీర సౌష్టవం, ముఖ వర్చస్సు ఇలా అన్నీ కూడా ఆంజనేయ స్వామి పాత్ర చెయ్యడానికి సరిపోతుంది.
అయితే రానా ఈ అప్పటికే సర్గరీ చేయించుకొని ఉన్నాడు, డాక్టర్లు ఏడాది పాటు షూటింగ్స్ లో పాల్గొనరాదని చాలా స్ట్రిక్ట్ గా చెప్పాడు, అందువల్ల ఆయన ఈ పాత్రని మిస్ చేసుకోవాల్సి వచ్చింది.
ప్రభాస్ మరియు రానా కాంబినేషన్ కి వరల్డ్ బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యింది, వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి(Baahubali ) సిరీస్ తెలుగు సినిమా తలరాతనే మార్చేసింది.మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇలాంటి అద్భుతమైన దృశ్య కావ్యం తెరకెక్కి ఉంటే మరోసారి బాహుబలి రిపీట్ అయ్యేదేమో, ఆడియన్స్ కి మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ ని చూసే అదృష్టం దొరకలేదు అని అనుకోవాలి.భవిష్యత్తులో అయినా వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందో లేదో చూడాలి.
ఇకపోతే ఆదిపురుష్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రారంభం అయ్యింది.మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చే వారం మంగళవారం రోజు కానీ, లేదా బుధవారం రోజు కానీ ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
ఆడియన్స్ కూడా ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.