టాలీవుడ్ లో ప్రస్తుతం జబర్దస్త్ నటులు దొరబాబు పరదేశి లు వ్యభిచారంలో పట్టుబడడంతో ఈ విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద రచ్చ చేస్తోంది.అంతేగాక ఇప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్నటువంటి దొరబాబు ఇలాంటి పనులు చేస్తూ దొరికిపోవడంతో కొందరు తీవ్రంగా నిందిస్తున్నారు.
అంతేగాక మరో నటుడు పరదేశి కూడా అవ్వాలనే కోరికతో ఎన్నోకలలతో సినీ ఇండస్ట్రీకి వచ్చి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా ఇలాంటి పనులు చేస్తూ దొరికిపోవడంతో ఇటు కుటుంబ సభ్యులు, అటు జబర్దస్త్ నిర్వాహకుల నుంచి కూడా వీరిద్దరు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.అయితే తాజాగా కొంతమంది ప్రజా సంఘాల నాయకులు కూడా దొరబాబు, పరదేశి లపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
అయితే ఇది అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు జబర్దస్త్ షో మెడకు చుట్టుకున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే సోషలిస్ట్ అయినటువంటి కృష్ణకుమారి అనే మహిళా నేత జబర్దస్త్ షో ని నిర్వహించకుండా అడ్డుకుంటామని పలు వ్యాఖ్యలు చేసింది.
అంతేగాక జబర్దస్త్ స్కిట్ లలో కూడా ఈ మధ్య డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువ అవుతున్నాయని వీటివల్ల కొందరు యువకులు తప్పుదోవ పడుతున్నారని చెప్పుకొచ్చింది.అంతేగాక ఇప్పటికే ఈ షోలో చూపించినటువంటి కొన్ని అసభ్యకర సన్నివేశాల ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని తొందర్లోనే మహిళా కమిషన్ ముందు పెట్టి ఈ షోని నిలిపి వేస్తామని చెప్పు కొచ్చింది.
అయితే ఏదేమైనప్పటికీ జబర్దస్త్ నటులు దొరబాబు, పరదేశి ఇలా వ్యభిచారం చేస్తూ దొరికిపోవడం టాలీవుడ్ ఇండస్ట్రీ పై మాత్రం బాగానే ప్రభావం పడినట్లు తెలుస్తోంది.మరి ఈ వ్యాఖ్యలపై జబర్దస్త్ నిర్వాహకులు ఎలా స్పందిస్తారో చూడాలి.అయితే ప్రస్తుతం జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమాలని ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ అయినటువంటి మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.