ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లలో మునుగుతున్న కాలం ఇది.ఏ విషయం అయినా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలుసుకోవడం, పంపించడం జరుగుతుంది.
సోషల్ మీడియా కు సంబంధించిన మాధ్యమాలు చాలా రకాల మాధ్యమ సంస్థలు అందించాయి.వాటినుండి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందిస్తూనే ఉంటారు.
కాగా ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్న వాట్సాప్ , ఇంస్టాగ్రామ్ లలో ఎన్నో రకాల సేవలు అందిస్తున్నారు.వాట్సాప్ లో చాలా వరకు కొత్త కొత్త ఫీచర్లు రాగా… వాట్సాప్ లో ఉన్న ఎమోజీ ల వల్ల ప్రమాదాలు ఉన్నాయని నిపుణులు తెలుపుతున్నారు.
వాట్సాప్ లో సమాచారాన్ని పంపే సందర్భంలో వచ్చే మాటలను చాలా వరకు ఎమోజీ ల రూపంలో పంపించడం జరుగుతుంది.వాట్సాప్ అందించిన ఎమోజీ లలో నవరసాలకు సంబంధించిన ఎమోజీ లు ఎక్కువగా ఉన్నాయి.
వాటిలో ముఖ్యంగా బాధ కలిగించే ఎమోజీ లను, కోపం గా ఉండే ఎమోజీ లను ఎవరైనా చూస్తే వెంటనే డిప్రెషన్ లోకి వెళ్లే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
వాట్సాప్ లో ఎవరైనా చాటింగ్ చేసే సందర్భంలో ఎమోజీ లను పంపడం వల్ల….ముఖ్యంగా బాధ, కోపం కలిగించే విషయంలో వర్డ్స్ టైపింగ్ బదులు ఎమోజీ లను పంపించడం వల్ల అవతలివాళ్ళు డిప్రెషన్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఒక అధ్యయనంలో పరిశీలించగా చాలామంది టీనేజర్లు డిప్రెషన్ కి లోనవుతున్నారని తేలింది.పైగా ఆ ఎమోజీలను ఎక్కువ సార్లు చూడటం వల్ల మెదడుపై ఒత్తిడి పెరిగి డిప్రెషన్లోకి వెళ్తున్నారని తెలిపారు.
కాగా నిపుణులు పరిశోధన చేసే క్రమంలో యువతి యువకులు పై….తమపై పడే భారాన్ని ఎలా తట్టుకుంటారని పరిశోధనలు చేయగా ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్తున్నారని నిరూపించారు.
నేరుగా టీనేజర్ల ని పరిశోధించి ఐ కాంటాక్ట్ తో పరిశీలించగా ఈ విషయం బయటపడింది.కాబట్టి అవతలివారికి ఏదైనా విషయాన్ని వెల్లడించే సమయంలో ఎమోజి లకు బదులు సమాచారాన్ని పంపాలని తెలిపారు.