ఏపీ రాజకీయాల్లో సరికొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ఎన్నికలకు ఇంకా రెండేండ్ల సమయం ఉన్నా సరే అన్ని పార్టీలు అప్పుడే వ్యూహాలు రచిస్తున్నాయి.
రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే తపనతో ఇప్పటి నుంచే అన్ని పార్టీలు పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి.ఇందులో ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీలు అన్నింటికంటే ముందు వరుసలో ఉంటున్నాయి.
ఎందుకంటే వీటికి బలం లేదు కాబట్టి ఎలాగైనా వైసీపీని ఢీకొట్టేందుకు ప్రయత్నాలు మొదలెట్టేశాయి.చంద్రబాబు నాయుడు ఒంటరిగా పోటీ చేసేకంటే జట్టుగానే చేయాలని భావిస్తున్నారు.
ఇందుకోసం జనసేనతో పొత్తు పెట్టుకుంటారనే ప్రచారం చాలా రోజుల నుంచి ఊపందకుంది.ఈ రూమర్లకు బలం చేకూర్చే విధంగానే ఆయన పనులు కనపడుతున్నాయి.ఇందుకు రీసెంట్గా చంద్రబాబు పాటిస్తున్న కొన్ని పనులే నిదర్శనం.అయితే రీసెంట్ గా పవన్ మీద ఆయన భారీగానే నమ్మకం పెట్టుకుంటున్నట్టు కనిపిస్తోంది.
ఇకపోతే ఆయన ఇప్పుడు మరోసారి పవన్ కోసం ఇంకో త్యాగం చేసేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది.త్వరలోనే పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే వపన్ పై విమర్శలు చేయడం మానేశారు టీడీపీ నేతలు.
అంతే కాదు కొన్ని నియోజకవర్గాలను కూడా ఇప్పటి నుంచే వదిలేస్తున్నట్టు తెలుస్తోంది.పైగా ఆయన పార్టీలోని ఫైర్ బ్రాండ్ నేతలను పవన్ మీద ఎలాంటి విమర్శలు చేయొద్దని ఆర్డర్ వేశారంట.ఒంటరి పోరుతో నష్టపోతున్నామని గ్రహించిన చంద్రబాబు పవన్ కు అన్ని రకాలుగా అనుకూల వాతావరణం సృష్టిస్తున్నట్టు తెలుస్తోంది.ఆయన పాజిటివ్ ఇమేజ్తోనే ప్రజల్లోకి వెల్లాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారంట.
ఇందుకోసం తనకు అనుకూలంగా ఉన్న మీడియాలో పవన్ వాయిస్ వినిపించేలా ప్లాన్ చేస్తున్నారంట.చూడాలి మరి రాబోయే కాలంలో వీరిద్దరి మధ్య పొత్తు ఏ రకంగా ఉంటుందో.
.