టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం “ఆదిపురుష్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓం రావత్ దర్శకత్వం వహిస్తున్నాడు.
కాగా ఈ చిత్రాన్ని దాదాపు ఐదు భాషలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. కాగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా సీతా దేవి పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.మరోవైపు ఇటీవలే ఈ చిత్రంలో ప్రభాస్ కి అక్క పాత్ర లో బాలీవుడ్ వెటరన్ హీరోయిన్ కాజోల్ నటిస్తున్నట్లు కూడా వార్తలు వినిపించాయి.
కానీ ఇప్పటివరకు వీరిద్దరూ ఈ చిత్రంలో నటిస్తున్నట్లు చిత్రయూనిట్ సభ్యులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కృతి సనన్ బాలీవుడ్ లో లక్ష్మణ్ ఉత్తేకర్ దర్శకత్వం వహిస్తున్న “మిమి” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
అలాగే ఇటీవలే ఓ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న చిత్రం లో హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.