తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఇతడికి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ గురించి తెలిస్తే అవాక్కవుతారు.అంతేకాక ఆ మధ్య ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి చిత్రం తో ఏకంగా తెలుగు సినిమా పరిశ్రమని ప్రపంచానికి పరిచయం చేశాడు.
దీంతో ప్రస్తుతం ప్రభాస్ కి దక్షిణాది లో కూడా క్రేజ్ తో పాటూ మార్కెట్ కూడా బాగా పెరిగింది.ప్రస్తుతం ప్రభాస్ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న “ఆదిపురుష్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.
అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే ఆదిపురుష్ చిత్రంలో హీరో ప్రభాస్ అక్క పాత్రలో బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ కాజోల్ నటిస్తున్నట్లు వార్తలు నెట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి.
అంతేగాక ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు ఈ విషయమై కాజోల్ ని సంప్రదించగా ఈ చిత్రం పాన్ ఇండియా తరహాలో ఉండటంతో ఆమె వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం.
అలాగే ఈ చిత్రంలో రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ ప్రముఖ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నట్లు ఇటీవలే చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
అంతేగాక ఈ చిత్రాన్ని 2022 వ సంవత్సరంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ తెలుగులో “రాధే శ్యామ్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కే.కె రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు దాదాపుగా 60 శాతానికి పైగా పూర్తయినట్లు సమాచారం. కాగా ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేయడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది.
దీంతో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.