బిజెపికి గేలం వేయకపోతే ఏపీలో తమకు పరిస్థితులు మరింత గడ్డుగా మారుతాయి అనే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడో గ్రహించారు.అందుకే అవకాశం చిక్కినప్పుడల్లా బిజెపి నేతలు అందరిని అదేపనిగా పొగుడుతూ, బిజెపి ప్రభుత్వానికి దగ్గరయ్యేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.
అయినా బిజెపి అగ్రనేతలు మాత్రం చంద్రబాబును దగ్గర చేసుకునేందుకు ఏమాత్రం ఇష్టపడలేదు గతంలో వారి అనుభవాలు ఈ దూరాన్ని పెంచుతున్నాయి.అయినా చంద్రబాబు మాత్రం బీజేపీకి దగ్గరయ్యేందుకు చేయని ప్రయత్నం లేదు.
అయితే బిజెపికి జగన్ కు మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడేలా ఆర్ఎస్ఎస్ నాయకులను మచ్చిక చేసుకుంటూ, వారి ద్వారా తన వ్యూహాన్ని అమలు చేయాలని బాబు ప్రయత్నిస్తూనే వస్తున్నారు.
తాజాగా తెలుగుదేశం పార్టీ మహానాడు లో కేంద్రానికి అంశాల వారీగా మద్దతు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడులో తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి .వాస్తవంగా కొద్దిరోజుల క్రితమే జగన్ ఇదే విషయాన్ని ఎప్పుడో ప్రకటించారు.అంతే కాదు ఈ కరోనా విపత్తు సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు.ఈ విషయంలోనూ జగన్ కేంద్రానికి మద్దతు తెలిపారు.ఇది తగువులు ఆడుకునే సమయం కాదు అని, ఇటువంటి సమయంలో దేశమంతా ప్రధాని నిర్ణయాన్ని గౌరవించి , ఆయనకు మద్దతుగా నిలవాలి అని జగన్ మాట్లాడారు.
ఆ విషయంపై ఎన్నో రాజకీయ విమర్శలను జగన్ ఎదుర్కొన్నారు.ఇక ఇప్పుడు టిడిపి ఈ విషయంలో ఇదే విధంగా స్పందిస్తోంది.గతంలో టిడిపి బీజేపీ పొత్తు రద్దు అయిన తరువాత బిజెపి ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ చంద్రబాబు బీజేపీ పై విరుచుకు పడేవారు.
కానీ ఆ తర్వాత బిజెపికి దూరం కావడం వల్ల జరిగిన నష్టం ఏమిటో గ్రహించిన ఆయన మళ్లీ ఆ పార్టీకి దగ్గరయ్యేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.వైసీపీ అధినేత జగన్ బీజేపీ కి అవసరమైన సందర్భాల్లో మద్దతు ఇస్తూ మరింత దగ్గర అవుతుండడాన్ని గ్రహించిన బాబు బిజెపికి
.