తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి ఈ టీవీ ప్లస్ లో ప్రసారమయ్యే పటాస్, ఢీ తదితర షోలలో యాంకరింగ్ నిర్వహిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ బ్యూటిఫుల్ యాంకర్ వర్షిణి సౌందరాజన్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో పలు చిత్రాలలో కూడా నటించింది.
కానీ ఆ పాత్రలకి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఎవరూ గుర్తించలేదు.కానీ బుల్లితెర పై మాత్రం పలు షోలు, ఈవెంట్లలలో నటిస్తూ బాగానే గుర్తింపు తెచ్చుకుంది.
అయితే తాజాగా యాంకర్ వర్షిణి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.అయితే ఇందులో యాంకర్ వర్షిణి ఓ వ్యక్తితో కలిసి దిగినటువంటి ఫోటోని తన అధికారిక సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అయితే ఈ ఫొటోలో వర్షిణి తో పాటూ ఉన్నటువంటి వ్యక్తి ముఖం మాత్రం కనిపించలేదు. దీంతో కొందరు నెటిజన్లు ఈ ఫోటో పై స్పందిస్తూ యాంకర్ వర్షిణి ప్రస్తుతం ప్రేమలో పడిందని తొందర్లోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
కానీ యాంకర్ వర్షిణి మాత్రం ఈ విషయంపై అస్సలు స్పందించడం లేదు.
ఈ విషయం ఇలా ఉండగా గతంలోకూడా వర్షిణి టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ డైరెక్టర్ తో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకోవాలనుకుందని ఇందులో భాగంగా వీరిద్దరూ 2017వ సంవత్సరంలో నిశ్చితార్థం కూడా చేసుకున్నట్లు పలు వార్తలు బలంగా వినిపించాయి.
కానీ అనుకోకుండా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఈ నిశ్చితార్థం క్యాన్సల్ అయిందని టాక్ వినిపిస్తోంది.కానీ ఇప్పటివరకు ఈ విషయం గురించి కూడా యాంకర్ వర్షిణి స్పందించక పోవడం గమనార్హం.
మరి ఇప్పటికైనా యాంకర్ వర్షిణి తన ప్రేమ, పెళ్లి విషయాలపై వస్తున్నటువంటి వార్తలు గురించి స్పందిస్తుందో లేదో చూడాలి.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ వర్షిణి పలు టెలివిజన్ ఛానళ్లలో ప్రసారమయ్యే షోలు, ఈవెంట్లు, చేస్తూ బాగానే సంపాదిస్తోంది.
అంతేకాకుండా తాజాగా ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.