అవును నిజమే.’మిస్టర్ ఎక్స్’ వంటి బాలీవుడ్ సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాని అమైరా దస్తర్కు దక్షిణాదిన మంచి గుర్తింపే కాదు, సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నాయి.
తమిళంలో ‘అనేగన్’(తెలుగులో అనేకుడు) చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన తర్వాత గ్యాప్ వచ్చింది.ప్రస్తుతం టాలీవుడ్లోకి ఎంట్రీ కావాలనుకుందో లేదో కానీ వరుస అవకాశాలు అమ్మడు తలుపు తడుతున్నాయి.
పూరి జగన్నాథ్ ‘రోగ్’ సినిమాలో నటిస్తుంది.ఈ సినిమా విడుదల కాకముందే విష్ణు మంచు పంజాబీ రీమేక్లో నటించడానికి ఎస్ చెప్పేసింది.
ఇవి కాకుండా ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో రానున్న సినిమా, రామ్ చరణ్ ‘తని ఒరువన్’ రీమేక్ లో హీరోయిన్గా పేరు పరిశీలనలో ఉంది.
అయితే తాజాగా అమైరా హాలీవుడ్ మూవీలో నటించబోతుంది.
అది కూడా జాకీ చాన్ సరసన నటించనుందని సమాచారం.చైనా బ్యాక్డ్రాప్లో తెరకెక్కబోయే సినిమాలో సోనూసూద్ నటిస్తున్నాడు.
ఈ సినిమా యాక్షన్ పార్ట్ కూడా పూర్తయింది.నిజానికి ఈ రోల్ కోసం యూనిట్ వర్గాలు గోవా బ్యూటీ ఇలియానాను కలిశారు కానీ ఇలియానా యాక్సెప్ట్ చేయలేదు.
దాంతో అవకాశం అమైరా దక్కించుకుంది.త్వరలోనే అమైరా షూట్లో పాల్గొనబోతుందట.