.బాలీవుడ్ విలక్షన నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు ఇర్ఫాన్ ఖాన్.తెలుగులో సైనికుడు సినిమాలో మహేష్ బాబుకి విలన్ గా నటించిన ఇర్ఫాన్ ఖాన్ తెలుగు ప్రేక్షకులకి కూడా పరిచయమే.తన నటనతో బాలీవుడ్ నుంచి హాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలు సొంతం చేసుకున్న అతి కొద్ది మంది నటులలో ఇతను కూడా ఒకడు.
అయితే ఊహించని విధంగా ఇర్ఫాన్ ఖాన్ 2017 నుండి క్యాన్సర్ బారిన పడిన సంగతి అందరికి తెలిసిందే.అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్న ఇతను కాస్తా రికవరీ అయిన తర్వాత ఇండియా వచ్చి కొన్ని సినిమాలలో నటించాడు.
ఇర్ఫాన్ ఖాన్ ప్రస్తుతం వెబ్ సిరీస్ ను చేస్తున్నాడు.ఆ వెబ్ సిరీస్ దాదాపుగా పూర్తి అయ్యింది.
అయితే ఈ ప్రాజెక్ట్ తర్వాత కొత్త సినిమాలు ఏవీ ఇర్ఫాన్ ఖాన్ ప్రస్తుతం కొత్త ఒకే చెప్పడం లేదని తెలుస్తుంది.పెద్ద పెద్ద దర్శకులు వచ్చిన కూడా నో చెబుతున్నాడని బాలీవుడ్ లో వినిపించింది.
ఈ నేపధ్యంలో తాజాగా ఇర్ఫాన్ ఖాన్ మీడియా ముందుకి వచ్చి తాను సినిమాలకి దూరంగా ఉండటానికి కారణం చెప్పాడు.తన ఆరోగ్యం ఏమాత్రం సరిగా లేదని.
అందుకే అమెరికాలో చికిత్స నిమిత్తం వెళ్తున్నాను.అక్కడ 9 నెలల పాటు చికిత్స తీసుకుంటానని చెప్పాడు.
ఈ కారణంగా సినిమాలకి ఈ తొమ్మిది నెలలు బ్రేక్ ఇస్తున్నట్లు స్పష్టం చేసాడు.అయితే ఇప్పటికే ఒకసారి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చిన ఇర్ఫాన్ ఇలా మరో సారి క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం సినిమాలకి దూరం కావడం అతని అభిమానులని కాస్తా కలవరానికి గురి చేస్తుంది.