భారత మాజీ అథ్లెట్ తన భార్యను, తల్లి చంపేశాడు.అమెరికాలో నివాసముంటున్న అథ్లెట్ ఇక్బాల్ సింగ్ ఈ ఘోరానికి పాల్పడ్డాడు.
వీళ్లిద్దరిని చంపేసి పోలీసులకు లొంగిపోయాడు.చంపడానికి గల కారణాలు ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు.
అమెరికాలోని పెన్సిల్వేనియాలో డెలావేర్ కౌంటీలో మాజీ అథ్లెట్ ఇక్బాల్ సింగ్, అతని కుటుంబ సభ్యులు నివాసముంటున్నారు.భార్య, తల్లిని హత్య చేసిన తర్వాత కొడుకుకి ఫోన్ చేశాడు ఇక్బాల్ సింగ్.
ఫోన్ లో ఇక్బాల్ ఇలా మాట్లాడాడు.‘‘ నేను మీ అమ్మను, నానమ్మను చంపేశాను.
నన్ను పోలీసులకు పట్టించు.’’ అని చెప్పాడు.
దీంతో అక్కడికి పోలీసులు చేరుకున్నారు.అప్పటికే అతను గాయాలతో రక్తం బయటకు వస్తున్నట్లు ఉంది.
ఇంట్లోకి వెళ్లి చూశాక ఇద్దరి మృతదేహాలు కనిపించాయి.అయితే ఇక్బాల్ సింగ్ కి అయిన గాయాలు తానే స్వయంగా చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
నేరాన్ని అంగీకరించి లొంగిపోయాడు.బెయిల్ కోసం అప్లై చేసినా ఆయన నిరాకరించాడు.
అయితే ఇక్బాల్ సింగ్ 1983 సంవత్సరంలో కువైట్ లో జరిగిన ఆసియా ఛాంపియన్ షిప్ లో కాంస్య పథకం సాధించాడు.షాట్ పుట్ లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.
అయితే తల్లిని, భార్యను ఎందుకు చంపాడు అనే కారణాలు తెలియాల్సి ఉంది.