కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందుల వల్ల జీవితంలో వేర్వేరు పనులు చేయాల్సి వస్తుంది.ఆ సమయంలో ఇబ్బందులను అధిగమించి ఒక్కో మెట్టు పైకి ఎదిగితే మాత్రమే కోరుకున్న సక్సెస్ దక్కుతుంది.
ఒకప్పుడు కూలీ, సెక్యూరిటీ గార్డ్, వంటవాడిగా పని చేసిన మనోజ్ శర్మ( Manoj Sharma ) తన టాలెంట్ తో ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ స్థాయికి ఎదిగారు.అతని సక్సెస్ స్టోరీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ ఆకట్టుకునేలా ఉంది.
జీవితాన్ని ఏ స్థాయి నుంచి అయినా రీస్టార్ట్ చేయవచ్చని నమ్మిన మనోజ్ శర్మ ఎంతో కష్టపడి ఆ నమ్మకాన్ని నిజం చేసుకున్నారు.మొరానాబాద్ జిల్లాలోని బిల్ గ్రామ్( Bill gram in Moranabad ) అనే కుగ్రామానికి చెందిన మనోజ్ ఇంటర్ పరీక్షలలో హిందీలో తప్ప అన్ని పరీక్షల్లో ఫెయిలయ్యాడు.
అయితే ఆ సమయంలోనే సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్( Sub Divisional Magistrate ) గా పని చేసే అధికారిని చూసి మనోజ్ స్పూర్తి పొందాడు.భవిష్యత్తులో తాను కూడా అధికారి కావాలని భావించాడు.
ఒకవైపు క్వారీ పనులకు కూలికి వెళ్తూనే మరోవైపు మనోజ్ చదువును కొనసాగించాడు.కూలీకెళ్తూనే ఇంటర్ పూర్తి చేసి అమ్మ తెచ్చిన అప్పుతో ఎం.ఎల్.బీ కాలేజ్ లో బీఏ పరీక్షలో చేరారు.బీఏ చదువుతూనే రైస్ మిల్లులో కొంతకాలం పాటు మనోజ్ శర్మ పని చేశారు.ఆ తర్వాత మనోజ్ గ్రూప్1 పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యారు.గ్రూప్1 పరీక్ష రద్దు కావడంతో మనోజ్ సివిల్స్ పై దృష్టి పెట్టాడు.
ఫ్రెండ్ ఇచ్చిన 10,000 రూపాయల డబ్బుతో మనోజ్ కోచింగ్ తీసుకున్నాడు.తన లోపాలను విశ్లేషించుకుని రోజుకు 12 గంటలు చదివిన మనోజ్ సివిల్స్ లో 121వ ర్యాంక్ సాధించాడు.ప్రస్తుతం మనోజ్ ముంబై మహా నగరానికి అడిషనల్ కమిషనర్ గా పని చేస్తున్నారు.
అడిషనల్ కమిషనర్ గా పని చేశారు.వేర్వేరు చోట్ల కూలీ, సెక్యూరిటీ గార్డ్, వంటవాడిగా పని చేసిన మనోజ్ తన సక్సెస్ తో ప్రశంసలను అందుకుంటున్నారు.