బీసీసీఐ 2008 నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) నిర్వహిస్తున్న విషయం మనందరికి తెలిసిందే.ఇపుడు జరుగుతున్నది 13వ ఎడిషన్.
కరోనా కారణంగా ఈ సంవత్సరం టోర్నమెంట్ దుబాయ్ లో నిర్వహిస్తున్నారు.అయితే ఐపిఎల్ లో 8 జట్లు మొదటినుండి కీలకంగా ఉన్నాయి.ఆ ఫ్రాంచైజీల యజమానులు ఎవరు ఇపుడు తెలుసుకుందాం.
చెన్నై సూపర్ కింగ్స్ :
2008 లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ని ఇండియా సిమెంట్స్ కొనుగోలు చేసింది.దానికి ఎన్.శ్రీనివాసన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ :
జీఎంఆర్ గ్రూప్ మొదట ఢిల్లీ ని 2008 లో కొనుగోలు చేసింది.ప్రస్తుతం జేఎస్ డబ్ల్యూ గ్రూప్ కూడా ఇందులో భాగంగా ఉంది.మొదట్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ గా ఉండేది.ఇపుడు ఢిల్లీ క్యాపిటల్స్ అని మార్చారు.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ :
డాబర్కు చెందిన మోహిత్ బర్మన్, వాడియా గ్రూప్ అధినేత నెస్ వాడియా, పీజర్ఎజడ్ మీడియా గ్రూప్ అధినేత ప్రీతి జింటా, అపీజయ్ సురేంద్ర గ్రూప్ నుంచి కరన్ పాలు పంజాబ్ ఓనర్లుగా ఉన్నారు. ప్రీతి జింటా టీం కార్యకలాపాలను చూస్తుంది.
కోల్ కతా నైట్ రైడర్స్ :
ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, మెహతా గ్రూప్ కు చెందిన జూహీ మెహతాలు కోల్ కతా ఫ్రాంచైజీ ఓనర్లుగా ఉన్నారు.
ముంబై ఇండియన్స్ :
ముంబై ఇండియన్స్ మొదట్నుంచీ రిలయన్స్ చేతిలో ఉంది.ముకేష్ అంబానీ భార్య నీతూ అంబానీ, కుమారుడు ఆకాష్ అంబానీలు టీం కార్యకలాపాలను చూస్తారు.
రాజస్థాన్ రాయల్స్ :
ఈ టీంకు మొత్తం 6 మంది ఓనర్లు ఉన్నారు.ఆస్ట్రేలియా స్పిన్నర్ షేన్ వార్న్ రాజస్థాన్కు గతంలో కోచ్ గా ఉన్నారు.ప్రస్తుతం ఓనర్ అయ్యాక టీంలోని స్పిన్నర్లకు మెంటార్గా వ్యవహరిస్తున్నాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్ :
మొదట్లో ఈ టీం డెక్కన్ ఛార్జర్స్ గా ఉండేది.దీనిని డెక్కన్ క్రోనికల్ కొనుగోలు చేసింది.తరువాత ఈ జట్టును సన్ నెట్వర్క్ కొనుగోలు చేసి సన్ రైజర్స్ గా పేరు మార్చింది.సన్ నెట్వర్క్ కు కళానిది మారన్ యజమాని గా ఉన్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ :
యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ కు చెందిన ఆనంద్ క్రిపాలు ఈ టీంకు ఓనర్ గా ఉన్నారు.మొదట్లో ఈ టీంకు లిక్కర్ మాల్యా ఓనర్ గా ఉన్నాడు.అతను మన దేశంలోని బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయాక ఆనంద్ క్రిపాలు ఓనర్ అయ్యారు.