కష్టాల్లో ఉన్నప్పుడే మన వారు ఎవరు, పరాయి వారు ఎవరని తెలుస్తుందంటారు.ప్రస్తుతం మన దేశంలో ఇదే జరుగుతుంది.
కరోనా కొరలకు చిక్కుకున్న భారతదేశం అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో మన దేశానికి అండగా ప్రపంచ దేశాలన్ని తమ వంతుగా సహాయాన్ని అందిస్తున్నాయి.
నిజానికి ఇది గర్వించదగ్గ విషయం.
ఇన్నాళ్లూ పగలతో రగిలిపోయిన చైనా, పాకిస్దాన్లు కూడా భారత్కు అండగా నిలవడానికి ముందుకు వచ్చాయి.ఇకపోతే ఎన్నో సంస్దలు విరాళాల రూపంలో కూడా ఆర్ధిక సహాయాన్ని ప్రకటిస్తున్నాయి.
ఈ క్రమంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ కూడా భారీ విరాళం ప్రకటించింది.
కరోనా సెకండ్ వేవ్కు చిక్కిన వారిని ఆదుకునేందుకు 7.5 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించింది.కాగా దేశవ్యాప్తంగా ఆపదలో చిక్కుకున్న వారికి ఈ విరాళం తక్షణ సాయంగా ఉపయోగ పడుతుందని భావిస్తున్నట్టు ఆ జట్టు యాజమాన్యం తెలిపింది.
ఇకపోతే కరోనా వల్ల దేశ ఆర్ధిక వ్యవస్ద అష్టకష్టాలు పడుతున్న విషయం తెలిసిందే.