14వ సీజన్ ఐపీఎల్ ఈ నెల 9 నుండి మొదలవుతుంది.కరోనా ప్రభావం వల్ల ఈసారి కూడా ఐపీఎల్ అంతా ఖాళీ స్టేడియంలోనే జరుగుతుంది.
అయితే ఎంపిక చేసిన ఆరు వేదికల్లోనే ఐపీఎల్ మొత్తం జరుగనుంది.మహారాష్ట్రలో రాత్రి పూట కర్ఫ్యూ విధించడంతో పాటు కొన్ని ఆంక్షలను ప్రకటించారు.
ఈ నేపథ్యంలో లీగ్ నిర్వహణపై అనేకా డౌట్స్ ఏర్పడ్డాయి.అయితే వాటిని క్లియర్ చేసేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ ఐపీఎల్ నిర్వహణ యదాథంగా జరుగుతుందని అన్నారు.
మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాత్రి 8 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ విధించారు.అయితే సోమవారం నుండే ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చింది.
ఈ సీజన్ ఐపీఎల్ లో భాగంగా ఏప్రిల్ 10 నుండి 25 మధ్య ముంబైలో 10 మ్యాచ్ లు జరగాల్సి ఉంది.ఏప్రిల్ 10న మొదటి మ్యాచ్ ఢిలీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతుంది.
అయితే మ్యాచ్ లు అన్ని అనుకున్న షెడ్యూల్ ప్రకంగా జరుగుతాయని స్పష్టం చేశారు.ఎంపిక చేసిన వేదికల్లో కట్టు దిట్టమైన ఆంక్షలతోనే ఈ మ్యాచ్ లు జరుగుతాయని తెలుస్తుంది.
అయితే ఐపీఎల్ ఆటగాళ్లందరికి కరోనా వ్యాక్సినేషన్ వేయాలన్న ప్రతిపాదన కూడా బీసీసీఐ కేంద్ర ఆరోగ్య శాఖ ముందు ఉంచింది.