ఐపీఎల్ 2021 రెండో దశ మ్యాచ్ షెడ్యూల్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ఆదివారం ప్రకటించింది.2021 ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన .కరోనా కారణంగా అర్థాంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ యూఏఈ కి తరలించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) సెప్టెంబర్ 19 నుంచి దుబాయిలో తిరిగి ప్రారంభం కానుంది.
డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మాజీ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో ఐపీఎల్ 2021 రెండో దశ మ్యాచ్ లు పునఃప్రారంభం కానున్నాయి.అదే నెల 11, 13 తేదీల్లో జరిగే ఎలిమినేటర్, 2వ క్వాలిఫైయర్ మ్యాచ్ లు షార్జా ఆతిథ్య ఇవ్వనుంది.24న రాయల్ చాలెంజర్స్, బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఫస్ట్ మ్యాచ్ జరుగనుంది.షార్జాలో 10 మ్యాచ్ లు అబుదాబిలో 8 మ్యాచ్ లు జరగనున్నాయి.ఎప్పటిలాగే మ్యాచ్ షెడ్యూల్ సాయంత్రం 3.30 గంటలకు సెకండ్ మ్యాచ్ 7.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.ఐపీఎల్ లీగ్ తర్వాత యూఏఈ వేదికగా టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లు జరుగనున్నాయి.
ఈ మ్యాచ్ లో అక్టోబర్ 15 నుంచి నవంబర్ 14 వరకు జరుగుతాయి.