గత ఏడాది కరోనా వైరస్ కారణం చేత ఐపీఎల్ 2020 సంవత్సరం చివరిలో యూఏఈ దేశంలో నిర్వహించంది బీసీసీఐ.ఇక ప్రతి సంవత్సరం లాగే మార్చి లేదా ఏప్రిల్ నెలలో మొదలయ్యే ఐపీఎల్ ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో మొదలవడానికి రంగం పూర్తిగా సిద్ధమైపోయింది.
తాజాగా 2021 ఐపీఎల్ సంబంధించి పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది ఐపీఎల్ పాలకవర్గం.
ఇందులో భాగంగా ఐపీఎల్ 2021 షెడ్యూల్ లో భాగంగా ఏప్రిల్ 9న తొలి మ్యాచ్ లో చెన్నై నగరంలో మొదలు కాబోతోంది.
ఈ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.ఇక ఫైనల్ మ్యాచ్ విషయానికొస్తే 30న అహ్మదాబాద్ లో కొత్తగా ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది.వీటితోపాటు ప్లే ఆఫ్ కు సంబంధించిన మ్యాచ్ లు కూడా ఇదే స్టేడియంలో జరగబోతున్నాయి.2021 ఐపీఎల్ 14వ సీజన్ లో భాగంగా ప్రతి జట్టు నాలుగు వేదికల్లో మ్యాచ్ లు ఆడి పోతున్నాయి.

2021 ఐపీఎల్ సీజన్ లో భాగంగా బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్కత్తా నగరాలలో 10 మ్యాచ్లు జరగనుండగా.ఢిల్లీ, అహ్మదాబాద్ నగరాలలో 8 మ్యాచ్ లు జరగనున్నాయి.ఈసారి కాస్త ప్రతిసారికి భిన్నంగా ఏ ఒక్క టీం కూడా హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ ఆడడం లేదు.మ్యాచులు రాత్రి గత సంవత్సరం లాగే రాత్రి ఏడున్నర గంటల సమయంలో మొదలు కానున్నాయి.
డబల్ హెడర్ మ్యాచ్ ఉన్న రోజులు మాత్రం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో మరొక మ్యాచ్ జరగనుంది.
Channels
Telugu HomeEnglish NewsTeluguStop Exclusive StoriesTelugu Flash/Breaking NewsTelugu Trending NewsTelugu PoliticalTelugu MovieTelugu Health TipsTelugu GossipsTelugu Crime NewsTelugu Movie ReviewsTelugu NRI NewsTelugu Viral VideosTelugu Bhakthi/DevotionalTelugu Press ReleasesTelugu Viral StoriesTelugu QuotesTelugu Photo GalleriesTelugu Photo TalksTelugu Baby Boy NamesTelugu Baby Girl NamesTelugu Celebrity ProfilesFollow Us!
Contact Us!
[email protected]About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy