ఐపీఎల్ - 2021 ఎవరిదో జోస్యం చెప్తున్న ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు..!

గత సంవత్సరం కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతాయో జరగవో అన్న నేపథ్యం నుండి ఎట్టకేలకు 2020 ఐపీఎల్ ఎటువంటి ఆటంకం లేకుండా ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచింది.అయితే మళ్లీ ఐపీఎల్ 14 వ ఎడిషన్ ఏప్రిల్ 9 నుంచి మొదలు కాబోతున్న నేపథ్యంలో మరోసారి టైటిల్ విజేత ఎవరన్న అంశంపై అనేక మంది క్రికెటర్లు, మాజీ క్రికెట్ ఆటగాళ్లు, విశ్లేషకులు పెద్ద ఎత్తున అంచనాలను చెబుతున్నారు.

 Ipl - 2021 Former England Player Predicting Someone Ipl 2021, Ipl Season, Indian-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ కూడా తన అంచనాలను సోషల్ మీడియా ద్వారా తెలియపరిచాడు.ఐపీఎల్ 14 సీజన్ మొదలు కాకముందే టైటిల్ ఎవరు గెలుస్తారో అతను చెప్పేశాడు.

ఇకపోతే మైకేల్ అంచనాల ప్రకారం గత సంవత్సరం డిఫెండింగ్ చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ జట్టు మరోసారి టైటిల్ గెలిచి సిక్స్ కొడుతుందని అతడు జోస్యం చెబుతున్నాడు.ఒకవేళ ఏదో అద్భుతం జరిగితే తప్ప మరో జట్టు టైటిల్ గెలవలేదని ఒకవేళ ముంబాయి విజేత కాని పక్షంలో టైటిల్ గెలుపొందే అవకాశం సన్రైజర్స్ హైదరాబాద్ కు మాత్రమే ఉందని ఆయన చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.ఆయన చెప్పిన జోస్యం పై మిగతా ఐపీఎల్ జట్ల అభిమానులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇందులో భాగంగానే విజేత ఎవరో నువ్వే నిర్ణయిస్తే మిగతా జట్లు ఆడటం ఎందుకని అతనిపై పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్.ఐపీఎల్ 14 సీజన్ ఏప్రిల్ 9న మొదలవుతున్న నేపథ్యంలో మొదటి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలబడబోతున్నాయి.

చూడాలి మరి ఈ సారి సీజన్ లో హేమాహేమీల చెప్పిన జోస్యం నిజమవుతుందో లేకపోతే మరి ఎవరైనా టైటిల్ గెలుస్తారో వేచి చూద్దాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube