వాంఖడే స్టేడియం సిబ్బందికి కరోనా..!

ఏప్రిల్ 9 నుండి ఐపిఎల్ 14వ సీజన్ మొదలవనుంది.కేవలం సీజన్ మొదలవడానికి ఆరు రోజులు మాత్రమే ఉండగా ఇలాంటి టైం లో ముంబై వాంఖడే స్టేడియంలో సిబ్బందికి కరోనా రావడం షాక్ ఇచ్చింది.

 Ipl 2021 Eight Workers Wankhede Stadium Tested Postive Ipl 2021, Eight Workers,-TeluguStop.com

స్టేడియంలో పనిచేస్తున్న 8 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.వారందరికి ఐసోలేషన్ లో ఉంచారు.

అయితే షెడ్యూల్ ప్రకారంగా ఏప్రిల్ 10న ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరగాల్సి ఉంది.ఇప్పుడు ఆ మ్యాచ్ ను జరిపించాలా లేదా క్యాన్సిల్ చేయాలా అన్న ఆలోచనలో ఉంది బిసిసిఐ.

కరోనా తీవ్రత మళ్లీ ఉదృతంగా అవుతున్న కారణంగా ఈ సీజన్ ఐపిఎల్ ను కేవలం 6 వేదికల్లోనే నిర్వహించాలని బిసిసిఐ నిర్ణయించింది.

చెన్నై, ముంబై, కోలకత్తా, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీ వేదికలుగా మ్యాచ్ షెడ్యూల్స్ ఏర్పాటు చేశారు.

ఈ సీజన్ లో ఎనిమిది ప్రాంచైజీలకు హోం అడ్వాంటేజ్ లేకుండా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కేవలం ఆరు వేదికల్లోనే ఈ మ్యాచ్ లు జరుగనున్నాయి.అయితే వాంఖడే స్టేడియంలో సిబ్బందికి కరోనా రావడంతో ఇప్పుడు అక్కడ కూడా మ్యాచ్ లు జరిగే ఛాన్స్ లేదని తెలుస్తుంది.

అయితే దీనిపై బిసిసిఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube