గత నెలలో భారత్-చైనా దేశాల మధ్య జరిగిన యుద్ధ వాతావరణం దృష్ట్యా భారతదేశంలో బాయ్ కాట్ చైనా అంటూ పెద్దఎత్తున నినాదాలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో భాగంగా భారతదేశంలోని అనేక రంగాలలో చైనా ఉత్పత్తులకు సంబంధించి ఎన్నో దిగుమతులను ఆపేసారు భారతదేశ వర్తకులు.ఇక ఇందులో భాగంగా ఐదు సంవత్సరాలకు గాను 2018లో చైనా దేశానికి చెందిన వివో సంస్థ ఏకంగా రూ.2199 కోట్లకు బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ కు స్పాన్సర్ షిప్ అందజేస్తుంది.
అయితే చైనా దేశం పై ఉన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో బిసిసిఐ సంస్థకు అందించే స్పాన్సర్ షిప్ ను తీసుకోవద్దని భారతదేశ క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.ఇలాంటి వాతావరణంలో వివో సంస్థ తనంతటతానే ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుండి తప్పుకుంది.
ఇక అప్పటి నుండి వివిధ సంస్థలు ఐపీఎల్ కు స్పాన్సర్ షిప్ అందించడానికి ముందుకు వస్తున్నాయి.ఈ దశలోనే భారతదేశానికి చెందిన జియో, పతాంజలి మరికొన్ని సంస్థలు స్పాన్సర్ షిప్ అందించడానికి ముందంజ వేశాయి.
సమాజానికి జరిగే ఐపీఎల్ టోర్నీ కోసం టైటిల్ స్పాన్సర్ గా వివరించేందుకు టాటా గ్రూప్ కంపెనీ బిసిసిఐకి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (EOI) ని సమర్పించడం జరిగింది.
టాటాగ్రూప్ ప్రస్తుతం రేసులో నిలవడంతో ఈనెల 18న జరగనున్న బిడ్డింగ్ మరికాస్త ఇంట్రెస్టింగ్ గా మారబోతోంది.
అయితే ఈ సంవత్సరం ఐపీఎల్ స్పాన్సర్ షిప్ కోసం టాటా గ్రూప్ సమర్పించినట్లు బీసీసీఐ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు.అయితే ఇంతవరకు పతాంజలి కూడా ఐపీఎల్ స్పాన్సర్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరిగిన చివరికి మాత్రం అధికారులు ఆ సంస్థ నుండి ఎటువంటి EOI ని సమీపించలేదని బీసీసీఐ అధికారులు తెలిపారు.
దీన్ని బట్టి పతాంజలి సంస్థ స్పాన్సర్ షిప్ రేసు నుండి వైదొలగి నట్టే.