గత మూడు నెలల నుండి ప్రపంచ వ్యాప్తంగా కరోనా నేపథ్యంలో ఎలాంటి క్రీడా సంబరాలు జరగడం లేదు.అలాగే నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒలంపిక్ క్రీడలు సైతం వాయిదా పడ్డాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలోనే భారత్ లో మార్చి నెలలోనే జరగాల్సిన ఐపీఎల్ కూడా వాయిదా పడుతూ వస్తుంది.ప్రస్తుతం భారతదేశంలో ఉన్న కరోనా కేసుల దృష్ట్యా ఈ సంవత్సరం ఐపీఎల్ జరుగుతుందా లేదా అని క్రికెట్ అభిమానులు అనేక అంచనాలు వేసుకుంటున్నారు.
ఒకవేళ ఐపీఎల్ 2020 నిర్వహించకపోతే బిసిసిఐకి ఏకంగా 4000 కోట్ల రూపాయల నష్టం వస్తుంది.కాబట్టి దాన్ని అధిగమించేందుకు బీసీసీఐ పలు కొత్త ఆలోచనలు రచిస్తోంది.అక్టోబర్-నవంబర్ నెలలో జరగబోయే టి20 వరల్డ్ కప్ నిర్వహణ ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేకపోయింది.దీంతో ఆ సమయాన్ని ఐపీఎల్ నిర్వహించడానికి బీసీసీఐ తీవ్రంగా శ్రమిస్తుంది.
ఇప్పటికే దుబాయ్, శ్రీలంక దేశాలు వారి దేశాలలో ఐపీఎల్ నిర్వహించాలని కోరగా తాజాగా న్యూజిలాండ్ కూడా ఈ లిస్టులో చేరింది.దీనికి కారణం న్యూజిలాండ్ లో కరోనా కేసులు లేకపోవడమే.
ఆ దేశ క్రికెట్ సంఘం ఐపీఎల్ ని న్యూజిలాండ్ నిర్వహించేందుకు సహకరిస్తామని తెలిపినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.చూడాలి మరి బీసీసీఐ ఎవరు వైపు మొగ్గు చూపుతోందా.
మొత్తానికి ఐపీఎల్ జరుగుతుందో లేదో కూడా.