ఐపీఎల్ 14వ సీజన్ అర్ధాంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఈ సీజన్ ఐపీఎల్ లో కరోనా కలకలం సృష్టించింది.
అందుకే బీ.సీ.సీ.ఐ ఈ సీజన్ ఐపీఎల్ ను వాయిదా వేసింది.ఐపీఎల్ వాయిదా వేయడంతో భారీ నష్టం జరుగుతుందని తెలిసినా ఆటగాళ్లలో కరోనా కేసులు ఎక్కువవడం వల్ల ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.క్రికెట్ అభిమానుల ఆశల మీద నీళ్లు చల్లి ఈ సీజన్ ఐపీఎల్ వాయిదా వేశారు.
మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో అనుకున్న ఈ సీజన్ ఐపీఎల్ త్వరలోనే మోలవుతుందని తెలుస్తుంది.
సీజన్ లో ఇంకా జరగాల్సిన 31 మ్యాచ్ లను యునైటెడ్ అరబ్ అమిరేట్స్ (యు.ఏ.ఈ) వేదికగా జరుగనున్నాయట.బీ.సీ.సీ.ఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.బీ.సీ.సీ.ఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అధ్యక్షతన జరిగిన నేటి వర్చువల్ జనరల్ మీటింగ్ లో ఈ డెశిషన్ తీసుకున్నారని తెలుస్తుంది.
అయితే ఇండియా, ఇంగ్లాండ్ ల మధ్య 5 మ్యాచ్ ల టెస్ట్ సీరీస్ ఉంది.అది పూర్తి కాగానే సెప్టెంబర్ 18, 19 నుండి షార్జా, అబుదాబి, దుబాయ్ లలో మిగిలిన ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించనున్నారు.ఐపీఎల్ 14వ సీజన్ ఫైనల్ మ్యాచ్ ను అక్టోబర్ 9, 10 వ తారీఖులలో నిర్వహిస్తారని తెలుస్తుంది.దీనికి సంబందించిన షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తారట.