ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో భారత్ తిరిగులేని శక్తిగా ఉంది.ఆస్ట్రేలియా, భారత్ ఎప్పటికప్పుడు నెంబర్ వన్ ర్యాంకు కోసం పోటీ పడుతున్నాయి.
ఇక భారత్ తో తలపడేందుకు అన్ని దేశాలు కొంత వరకు భయపడుతున్నాయి.ఇండియన్ క్రికెట్ టీంతో పోల్చుకుంటే పాకిస్తాన్ క్రికెట్ టీం ప్రస్తుతం పసికూన అని చెప్పాలి.
అయితే ఇండియా అనేసరికి ఆ దేశం ఆటగాళ్ళు ఎప్పుడు కసిగా ఆడుతూ ఉంటారు.ఒకప్పుడు అయితే మరింత ఎక్కువ కసితో ఆడేవారు.
ఇండియాతో మ్యాచ్ ఓడిపోతే ఆ దేశంలో ఆటగాళ్ళకి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది.దానికి భయపడి క్రికెట్ ఆడేవారు.
అయితే గతంలో పాకిస్తాన్ క్రికెట్ టీంకి కెప్టెన్ గా సుదీర్ఘ కాలం సేవలు అందించి ప్రస్తుతం ముస్లిం మతబోధకుడుగా మారిపోయిన ఇంజిమామ్ హక్ భారత్ ఆటగాళ్ళ మీద సంచలన వాఖ్యలు చేశారు.తాను క్రికెట్ ఆడే రోజుల్లో భారత క్రికెటర్లు జట్టు కోసం కాకుండా స్వార్థంగా ఆడేవారని సంచలన ఆరోపణలు చేశారు.
భారత క్రికెటర్లు ఎప్పుడూ వ్యక్తిగత రికార్డులే లక్ష్యంగా బ్యాటింగ్ చేస్తారని, కానీ పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ మాత్రం జట్టు ప్రయోజనాల కోసమే ఆడేవారని ఇంజమామ్ తెలిపారు.వారంతా జట్టు కోసం కాకుండా సెంచరీల కోసమే ఆడేవారన్నారు.
కాగితపు పులులుగా బ్యాంటింగ్ బలంగా కనపడేదని, కానీ వారంతా వ్యక్తిగత ప్రదర్శనకే ప్రాముఖ్యతనిచ్చేవారని, జట్టు ఓడిపోతున్నా వారికి పట్టేది కాదని ఆరోపించారు.అప్పటికి భారత్ ఆటగాళ్ళ మాదిరిగానే ఇప్పుడు పాకిస్తాన్ ఆటగాళ్ళు మారిపోయాయని, కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే క్రికెట్ ఆడుతున్నారని వారి ఆటగాళ్ళని కూడా విమర్శించారు.
అయితే వారి ఆటగాళ్ళని విమర్శించడానికి మన లెజెండ్ క్రికెటర్లుని అవమానించడం ఎంత వరకు కరెక్ట్ అనే ప్రశ్న వస్తుంది.దీనిపై మన మాజీ ఆటగాళ్ళు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.