జాతీయ స్థాయిలో ప్రభంజనం సృష్టించి తెలుగు సినిమాకు ఎనలేని కీర్తి తెచ్చిన బాహుబలి సినిమా మరో అరుదైన కానుక అందుకుంది.ఈ యేడు ప్రకటించిన జాతీయ అవార్డులో జాతీయ ఉత్తమ చిత్రంగా బాహుబలి నిలబడి తెలుగు కీర్తిని చాటింది.
అందుకుగాను పలువురు సినీ, రాజకీయ పారిశ్రామిక ప్రముఖులు బాహుబలి టీమ్ కు అభినందనలు తెలిపారు.ముఖ్యంగా రాజమౌళి, ప్రభాస్, రమ్యకృష్ణ, రానా వంటివారిని ప్రత్యేకించి అభినందించారు
ఆ అభినందనలు ఎంతలా ఉన్నాయంటే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభల్లో బాహుబలి గురించి ప్రస్తావించేంత.
అలాగే తెలంగాణా పురపాలక మంత్రి కేటీఆర్ సైతం తనదైన శైలిలో బాహుబలికి శుభాకాంక్షలు చెబుతూ చమత్కరించారు.ట్విట్టర్ లో బాహుబలి టీమ్ కు శుభాకాంక్షలు చెబుతూ రాజమౌళి, రానా, తమన్నా లతో పాటు ప్రభాస్ ను ట్యాగ్ చేద్దామనుకున్న కేటీఆర్ కు ప్రభాస్ సజషన్ రాకపోవడంతో ‘ రానా ప్రభాస్ ను కూడా ట్విట్టర్ లోకి తీసుకురా’ అంటూ ట్వీట్ చేసి అందరినీ గిలిగింతలు పెట్టాడు.