విజయవాడ కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో అవినీతి కేసుపై విచారణ వేగవంతంగా కొనసాగుతోంది.ఈ వ్యవహారంలో అరెస్ట్ చేసిన నలుగురు ఉద్యోగుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతిని ఇచ్చింది.
ఈ మేరకు నలుగురు ఉద్యోగులను పోలీసులు మూడు రోజులపాటు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.మరోవైపు ఈ కేసులో ఏ5 గా ఉన్న సూర్యనారాయణ ఎంఎస్జే కోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారని తెలుస్తోంది.