హైదరాబాదులో పబ్ లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.పబ్ అనుమతులు, చర్యలపై హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ సీపీలు కౌంటర్ దాఖలు చేశారు.
అంతేకాకుండా ఎక్సైజ్ శాఖల అనుమతులపై న్యాయస్థానానికి అధికారులు నివేదిక సమర్పించారు.ఈ క్రమంలో పబ్బులపై నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి మ్యూజిక్ సిస్టం ఉండకూడదని తెలిపింది.ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
దసరా సెలవుల తర్వాత మరోసారి ఈ విషయంపై విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.