మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ‘ప్రతి రోజు పండుగే’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అయ్యింది.ఈ చిత్రంపై జనాల్లో ఆసక్తి ఉంది.
ప్రస్తుతం విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ సమయంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియలో హల్చల్ చేస్తోంది.
ఈ చిత్రం సూపర్ హిట్ మూవీ శతమానం భవతికి సీక్వెల్ అంటూ ఆ సినిమా కథకు కొనసాగింపు అంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం శతమానం భవతి సినిమా కథ ఈ సినిమా కథ సేమ్ ఉంటుందని అంటున్నారు.
శతమానం భవతికి సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించగా ప్రతి రోజు పండుగే సినిమాకు మారుతి దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే.ఈ రెండు వేరు వేరు కథలు అని అసలు ఇలా సీక్వెల్ వార్తలు ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు వాపోతున్నారు.
ప్రతి రోజు పండుగే సినిమా విడుదల సమయంలో ఈ ఆశ్చర్యకర ప్రకటనలు ప్రస్తుతం ప్రేక్షకుల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.