తెలుగుదేశం పార్టీ కి రాష్ట్రంలో ఎదురే లేదని, ఆం్రధ్రపదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిమిడి కళావెంకటరావు వ్యాఖ్యానించారు.27 నుంచి జరగనున్న మహానాడు జరగనున్న సందర్భంగా బుధవారం ఆయన .తెలుగు స్టాప్ తో మాట్లాడుతూ జాతీయ పార్టీ గా ఎదిగిన తెలుగుదేశం తెలుగువారి అభివృద్ధి తో పాటు ్రపపంచంలో .తెలుగు వారు ఎక్కడున్నా, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని తెలిపారు.
తెలుగువారికి అన్యాయం చేసేలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన జరిపి ఇప్పుడు ఫలితం అనుభవిస్తోందని, ఆ పార్టీ తిరిగి జనం అభిమానం పొందటం వట్టిమాటే అని అన్నారు.ఇష్టానుసారంగా తెలుగు వారిని చిన్నాభిన్నం చేసిన సోనియా గాంధీ కి మద్దతు చెప్పిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కారుస్తున్న మొసలి కన్నీళ్ళని జనం నమ్మరని వ్యాఖ్యానించారు.
తెలంగాణ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల కాంట్రాక్టులు అనుచరులకు ఇప్పించుకున్న జగన్, చేస్తున్న దొంగ దీక్షలను ప్రజలు గుర్తించారని, .జగన్ దీక్షలకు సొంత పార్టీ నేతలే మద్దతు చెప్పడంలేదని, రాష్ట్ర అభివృద్ధి నిరోధకుడిగా నిలవటం ఖాయమనిఅన్నారు.మిగులు జలాలపై హక్కు కోరబోమని నాటి ముఖ్యమం్రతి వైఎస్ నిర్ణయాల కారణంగానే జల వివాదాలు రేగుతున్న విషయం జగన్కు తెలియనిదా అని నిలదీసారాయన.ఇప్పటికే అక్రమాస్తుల కేసులు ఎదుర్కొంటున్న ఆయన జనం దృష్టి మరలించాలని చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావని వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం కార్యకర్తల పండగ మహానాడు మహోన్నతంగా నిర్వహించనున్నామని కళా తెలిపారు.కలియుగ వెంకటేశ్వరుని చెంత జరుగుతున్న ఈ సారి మహానాడుకు దేశ విదేశాల నుంచి వేలాది మంది ్రపతినిధులు హాజరు కానున్నట్లు చెప్పారాయన.
అంగరంగ వైభవంగా మహానాడు జరగనుందని, ఇందులో రాష్ట్ర అబివృద్ధి తో పాటు రాష్ట్ర విభజన తదుపరి ఎదుర్కొన్న సమస్యలపై ర్చిస్తా మని, స్పష్టం చేసారాయన
.