తిరుమల తిరుపతి దేవస్థానంను ప్రతి రోజు లక్షలాది మంది సందర్శిస్తున్న విషయం తెల్సిందే.వేలాది మంది టీటీడీ అధికారులు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సేవలు అందిస్తూ ఉంటారు.
టీటీడీకి వస్తున్న ఆదాయం నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించి ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు సేవలు అందిస్తూ ఉన్నారు.ఉద్యోగస్తుల వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు సేవలు పొందుతున్నారు.
కాని నిన్న ఇంటర్నెట్ సమస్య కారణంగా వేలాది మంది భక్తులు ఇబ్బందులకు గురయ్యారు.
తిరుమలలో టీటీడీకి సంబంధించిన కంప్యూటర్లు మొరాయించాయి.
పలు విభాగాల్లో ఇంటర్నెట్ రాకపోవడంతో ఆన్ లైన్ సేవలు నిలిచి పోయాయి.తద్వారా కొన్ని గంటల పాటు చాలా మంది భక్తులు ఇబ్బందులు పడ్డారు.
రూం బుకింగ్ నుండి పలు రకాల సేవలు కూడా ఆన్ లైన్ లోనే చేస్తారు.అవన్నీ కూడా నిలిచి పోవడంతో భక్తులు నానా ఇబ్బందులకు గురయ్యారు.
తిరుమలలో మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటామని టీటీడీ అధికారులు హామీ ఇచ్చారు.