పుల్వామా దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ తో పూర్తిగా సంబంధాలు తెంచుకోవడానికి సిద్ధమైంది.ఇప్పటికే దౌత్యపరమైన సంబంధాలు తెంచుకున్న భారత్ ఇక ఆ దేశంతో ముడిపడి వున్నా అన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి రెడీ అయ్యింది.
అందులో భాగంగా ఇండియాలో జరిగే ప్రపంచ కప్ షూటింగ్ లో పాల్గొనడానికి వీసా దరఖాస్తు చేసిన పాక్ షూటర్స్ భారత్ వీసాలు నిరాకరించింది.అయితే ఈ పోటీ ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో జరగడంతో భారత్ పాక్ షూటర్స్ పై తీసుకున్న చర్యలపై సీరియస్ అయ్యింది.
భారత్ తన నిర్ణయంతో భవిష్యత్తులో అంతర్జాతీయ పోటీలకి ఆతిధ్యం ఇచ్చే విషయంలో చర్చలు నిలిపేసింది.దాంతో పాటు ప్రపంచ కప్ పోటీలలో 25 మీటర్ల రాపిడ్ ఫైర్ ఈవెంట్ కి ఒలింపిక్ అర్హత హోదా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
అంతర్జాతీయ క్రీడా పోటీలలో పాల్గొనే అన్నే దేశాల క్రీడాకారులని, క్రీడా ప్రతినిధులు సమానంగా చూడాలని, అలా కాకుండా వివక్ష పూరితంగా వ్యవహరించడం, అలాగే తమ స్వార్ధ ప్రయోజనాల కోసం, క్రీడాకారులపై నిషేధం విధించడం, రాజకీయాలతో క్రీడలని ముడిపెట్టడం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఈ కారణంగానే భారత్ తో చర్చలు నిలిపెసినట్లు ఒలింపిక్ కమిటీ ప్రకటించింది.ఇక భారత్ సర్కార్ లిఖిత పూర్వక హామీ ఇచ్చి ఇకపై క్రీడల విషయంలో రాజకీయ జోక్యం చేసుకోమని హామీ ఇస్తేనే మరల చర్చలు నిర్వహిస్తామని ఒలింపిక్ కమిటీ ప్రకటించింది.