మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా ఉన్న రాజకీయ నాయకుడు.అయితే ఇప్పుడు మాజీ మంత్రి ఈటెల బీజేపీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు బీజేపీ లో ఇప్పుడు కీలక నేతగా ఈటెల రాజేందర్ ఉన్న పరిస్థితి ఉంది.అయితే స్వతహాగా కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన వ్యక్తి అయిన ఈటెల పట్ల బీజేపీలో అంతర్గత చర్చ నడుస్తోంది.
రాజకీయాలలో ఒక పార్టీలో చేరామంటే ఆ పార్టీ సిద్దాంతాలను క్షేత్ర స్థాయి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి.ప్రజల్లో పార్టీ పట్ల అభిమానం కలిగేలా నాయకుల వ్యవహార శైలి ఉండాలన్నది, ఆ దిశగా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త నుండి మొదలుకొని పై స్థాయి నాయకుల వరకు మెదులుకోవాలనేది ప్రతి రాజకీయ పార్టీ నియమ నిబంధనలలో ఒకటిగా ఉంటుంది.
అయితే ఈటెల విషయంలో బీజేపీ మాత్రం అసంతృప్తిగా ఉందని రకరకాలుగా చర్చ నడుస్తోంది.అయితే విషయం ఏమిటంటే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటెల బలమైన నాయకుడు అందులో ఎటువంటి సందేహం లేదు.
అయితే ఇంతకు ముందు పనిచేసిన పార్టీలో వ్యవహరించినట్టు చేరిన పార్టీలో వ్యవహరించవద్దు అనేది సదరు పార్టీలో చేరిన వారికి ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఉంటుంది.అయితే టీఆర్ఎస్ పార్టీలో ఎక్కువగా ముఖ్యమైన విషయాలకు సంబంధించిన వాటిల్లో మాత్రమే ఈటెల రాజేందర్ పాల్గొనే వారు.
ఎందుకంటే పార్టీలో ఎన్నో ఏళ్లుగా పనిచేసిన అనుభవం ఉంది కావున పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే విధులను నిర్వర్తించాల్సిన అవసరం రాదు.కాని బీజేపీ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పార్టీ.అందుకే ఈ సమయంలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఓట్లను అడగవలిసిన పరిస్థితి ఉంటుంది.కాని ఈ విషయంలో జెండాను గౌరవిస్తున్నా వ్యక్తిగత ఎజెండాకె ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీని మొదటి వరుసలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని బీజేపీలో అంతర్గత చర్చ జరుగుతోందని వినికిడి.