గత రెండు పర్యాయాలుగా టీఆర్ఎస్ అఖండ విజయంతో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.అయితే తరువాత జరిగిన ఒక్క దుబ్బాక ఉప ఎన్నిక తప్ప, తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తూ వస్తోంది.
అయితే టీఆర్ఎస్ లో గతంలో కూడా అంతర్గత విభేదాలు వచ్చినా కూడా పెద్దగా బహిరంగంగా చర్చకు రాలేదు.అయితే స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య ఎప్పటి నుండో ఆధిపత్య పోరు నడుస్తున్నప్పటికీ కేసీఆర్ కడియంకు ఎమ్మెల్సీ ఇచ్చి, రాజయ్యకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి బుజ్జగించిన పరిస్థితి ఉంది.
కాని తాజాగా వారిద్దరి మధ్య ఉన్న వర్గపోరు మరో సారి బహిర్గతమైంది.ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
టీఆర్ఎస్ లో అంతర్గత కలహాలపై ప్రతిపక్షాలు ఏమి జరుగుతుందా అని ఆసక్తిగా గమనిస్తున్నాయి.చూద్దాం ఈ వీరిద్దరి వివాదాన్ని కేసీఆర్ పరిష్కరించి ముగింపు ఎలా పలుకుతాడనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
అయితే ఇప్పటికే మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి,ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యలు ఇలా ఇంకొంత మంది టీఆర్ఎస్ అగ్ర నేతలు బహిరంగంగా తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు.అయితే పార్టీలో తమకు దక్కుతున్న ప్రాధాన్యం పట్ల ఈటెల అసంతృప్తిగా ఉండడంతో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయంపై కేటీఆర్, కేసీఆర్ ఎటువంటి సంరక్షణ చర్యలు తీసుకుంటారనేది చూడాల్సి ఉంది.