దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమాను టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కించాడు.
ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది.
ఎట్టకేలకు ఈ సినిమా మార్చి 25న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించడంతో మళ్ళీ ఈ సినిమా కోసం ఎదురు చూడడం మొదలు పెట్టారు.ఈసారి కరోనా కూడా తగ్గడంతో రావడం పక్కా అంటున్నారు మేకర్స్.ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఫ్యాన్స్ అంతా ఉత్సాహంగా ఉన్నారు.
ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే చర్చ జరుగుతుంది.
మొన్నటి వరకు ప్రభాస్ రాధేశ్యామ్ గురించి మాట్లాడుకున్న అభిమానులు ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు.
ఈ సినిమా గురించి ఒక్కో వార్త బయటకు వస్తుంటే మరింత ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది.ఇక మెగా మరియు నందమూరి ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా వాళ్ళ అభిమాన హీరో సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
తాజాగా మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇద్దరు హీరోల ఎంట్రీ విషయంలో రాజమౌళి చాలా జాగ్రత్త తీసుకున్నాడట.వీళ్ళ ఎంట్రీకి సంబంధించి పలు వెర్షన్లను రాసుకుని చివరికి అద్భుతమైన వెర్షన్ తెరమీద చూపించనున్నాడని టాక్ వినిపిస్తుంది.ఎన్టీఆర్ పులితో చేస్తున్న సన్నివేశంతో ఎంట్రీ ఇవ్వనున్నాడని, చరణ్ పోలీస్ అవతారంలో ఒక అద్భుతమైన యాక్షన్ సన్నివేశంలో ఎంట్రీ ఇస్తాడని టాక్ వస్తుంది.
మరి చూడాలి ఈ హీరోల ఎంట్రీకి విజిల్స్ పడతాయో లేదో.