మెగా స్టార్ చిరంజీవి ఆచార్య సినిమా నుండి టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ మెగా అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులు అందరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందిన కారణంగా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా ఇప్పటికే ప్రకటన వచ్చేసింది.ఇక ఈ సినిమా టీజర్ విడుదలకు టైం వచ్చేసింది.
ఈనెల 29న టీజర్ ను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు.ఈ టీజర్ గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతుంది.
రామ్ చరణ్ కనిపిస్తాడని ఎక్కువ మంది అంటున్నారు.కాని ఈ టీజర్ లో రామ్ చరణ్ కనిపించడం లేదు.
కాని వినిపించబోతున్నాడట.
సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్ కోసం రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు.దాదాపుగా నిమిషం పాటు సాగే టీజర్ లో చిరంజీవి విజువల్స్ తో పాటు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ కూడా అద్బుతంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతుంది.
వచ్చే నెల 7వ తారీకు నుండి రాజమండ్రిలోని అటవి ప్రాంతంలో జరిగే అవకాశం ఉందంటున్నారు.పుష్ప సినిమా షూటింగ్ జరిగిన ప్రదేశంలోనే ఆచార్య షూటింగ్ కు వెళ్తున్నారు.
ఇక టీజర్ విడుదల తర్వాత సినిమా పై పూర్తి క్లారిటీ వస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు.చిరంజీవి పాత్ర ఏంటీ చరణ్ పాత్ర ఎలా ఉండబోతుంది అనేది టీజర్ లో క్లారిటీ ఇవ్వడం ఖాయం అంటున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా కీలక మైన పాత్రలో నటిస్తున్న చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించబోతున్న విషయం తెల్సిందే.