పరుశురామ్ పెట్ల. గీత గోవిందం సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకుని స్టార్ డైరెక్టర్ ల దృష్టిలో పడ్డాడు.
ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ తో సర్కారు వారి పాట సినిమాను చేసాడు.ఈయన గీత గోవిందం తర్వాత నాగ చైతన్య తో సినిమా చేయాలనీ ఆయనను ఒప్పించాడు.
అయితే అదే సమయంలో మహేష్ బాబు నుండి పిలుపు రావడంతో ఆయన నాగ చైతన్య ను పక్కన పెట్టి సూపర్ స్టార్ తో సినిమా చేసాడు.
ఇక ఇప్పుడు ఈ సినిమా పూర్తి అవ్వడమే కాకుండా మహేష్ బాబుకు సూపర్ హిట్ కూడా అందించాడు పరశురామ్.
దీంతో ఇక ఇప్పుడు నాగ చైతన్య తో సినిమా లైన్లో పెట్టనున్నాడు.ఇప్పటికే పరశురామ్ నాగ చైతన్య తో సినిమా చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించాడు.ఇక వీరి సినిమా త్వరలోనే పట్టాలెక్క బోతుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా టైటిల్ గురించిన వార్త ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది.
ఈ సినిమా టైటిల్ విషయంలో ఒక పేరు తెరమీదకు వచ్చింది.
ఈ సినిమాకు పరశురామ్ నాగేశ్వరరావు అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరుగు తుంది.ఈ విషయమై అధికారిక ప్రకటన ఇప్పట్లో రాకపోయినా ఈ వార్త మాత్రం నెట్టింట వైరల్ అయ్యింది.ఇక పరశురామ్ మహేష్ బాబుకు సూపర్ హిట్ అందించడంతో చైతూ కూడా ఈ సినిమా విషయంలో ధీమాగా ఉన్నాడు.
మరి ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.ఇక నాగ చైతన్య ప్రెసెంట్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమా పూర్తి చేసి రిలీజ్ కూడా రెడీగా ఉంచాడు.రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జులై లో రిలీజ్ కానుంది.ఇక ఈ సినిమా తర్వాత మళ్ళీ ఈయన దర్శకత్వంలోనే దూత అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు.
ఈ వెబ్ సిరీస్ కూడా త్వరలోనే పూర్తి కానుంది.ఇవి పూర్తి అయ్యాక పరశురామ్ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.