బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధించడంతో పాటు ప్రభాస్ కు క్రేజ్ ను పెంచాయనే సంగతి తెలిసిందే.అయితే సాహో, రాధేశ్యామ్ సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగినా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపడంలో ఈ రెండు సినిమాలు ఫెయిలయ్యాయి.
రాధేశ్యామ్ సినిమాకు యావరేజ్ టాక్ రావడంతో పాటు ఈ సినిమా క్లాస్ సినిమా కావడం ప్రభాస్ కు మైనస్ అవుతోంది.
అయితే సాహో, రాధేశ్యామ్ సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రభాస్ భవిష్యత్తు సినిమాలకు భారీస్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి.
రాధేశ్యామ్ సినిమాకు ఓవర్సీస్ లో 20 కోట్ల రూపాయల బిజినెస్ కూడా జరగలేదు.రాధేశ్యామ్ మేకర్స్ ఓవర్సీస్ లో సొంతంగా ఈ సినిమాను గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ సహాయంతో రిలీజ్ చేయడం గమనార్హం.
అయితే ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్టులైన సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలకు మాత్రం కళ్లు చెదిరే ఆఫర్లు వస్తున్నాయి.
ప్రభాస్ సలార్ సినిమాకు 50 కోట్ల రూపాయలు మేకర్స్ ఆశిస్తుండగా ఆ మొత్తం కంటే కొంచెం తక్కువ మొత్తం ఇస్తామని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారని బోగట్టా.ప్రాజెక్ట్ కె సినిమాకు మేకర్స్ 70 కోట్ల రూపాయలు ఆశిస్తుండగా బేరసారాలు జరుగుతున్నాయని అతి త్వరలో డీల్ ఫైనల్ కానుందని సమాచారం అందుతోంది.ప్రభాస్ సినిమాలకు ఓవర్సీస్ లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఏర్పడింది.
బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాలు ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తాయో చూడాల్సి ఉంది.ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది రిలీజవుతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
వరుసగా సినిమాలలో నటిస్తున్న ప్రభాస్ ఆ సినిమాల షూటింగ్ వేగంగా పూర్తయ్యే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం గమనార్హం.ప్రభాస్ నటించిన ఆదిపురుష్ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది.