టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత ఇప్పటికే శాకుంతలం సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం సమంత యశోద సినిమాలో నటిస్తున్నారు.
వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటిస్తూ సమంత సత్తా చాటుతున్నారు.ప్రస్తుతం యశోద సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న సమంత ఇంటికి దూరంగా ఉన్నారని తెలుస్తోంది.
గతేడాది పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడం ద్వారా సమంత పేరు మారుమ్రోగింది.
పుష్ప ది రైజ్ లో హీరోయిన్ గా నటించిన రష్మిక కంటే సమంత పేరే ఎక్కువగా వార్తల్లో వినిపించడం గమనార్హం.
ప్రస్తుతం సమంత నటిస్తున్న యశోద పాన్ ఇండియా మూవీగా హరీష్ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది.హైదరాబాద్ లో మూడు కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేసి వేసిన సెవెన్ స్టార్ హోటల్స్ సెట్ లో ప్రస్తుతం యశోద సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి.
యశోద మూవీలో మూడో వంతు సన్నివేశాలను ఇక్కడే షూట్ చేయనున్నారని తెలుస్తోంది.
అయితే సమంత ఈ సినిమా సెట్స్ లోనే ఇంటిని వదిలి ఉండిపోయారని సమాచారం అందుతోంది.
తక్కువ సమయంలోనే సెట్ లో రెడీ అయ్యే ఛాన్స్ ఉండటంతో పాటు త్వరగా షూట్ కు రెడీ కావచ్చని భావించి సమంత ఈ నిర్ణయం తీసుకున్నారని బోగట్టా.సోషల్ మీడియాలో ఈ మేరకు ప్రచారం జరుగుతుండగా వైరల్ అవుతున్న వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
సమంత ఈ సినిమా కొరకు మూడు కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం అందుతోంది.వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.