బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ ఆ తర్వాత కూడా వరస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు ఐదు సినిమాలు ఉన్నాయి.
అందులో ఆదిపురుష్ సినిమా ఒకటి.ఆదిపురుష్ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.
రామాయణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.కరోనా కారణంగా షూటింగ్ కు బ్రేకులు వేశారు.అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్న నేపథ్యంలో మళ్ళీ షూటింగ్స్ పునః ప్రారంభం చేయాలనీ మేకర్స్ అనుకుంటున్నారు.ఇప్పటికే హైదరాబాద్ లో షూట్ చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్టు టాక్.
మరి త్వరలోనే ఆదిపురుష్ సినిమా షూట్ కూడా స్టార్ట్ కాబోతుంది. విజువల్ వండర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.ఇందులో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తున్నారు.అయితే సీత పాత్ర గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో సీత పాత్రను చాలా కొత్తగా విభిన్నంగా ప్రెసెంట్ చేయబోతున్నారని టాక్ నడుస్తుంది.
అంతేకాదు సీత పాత్ర చాలా ఆసక్తికరంగా ఉండబోతుందని తెలుస్తుంది.సీత గురించి ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయాలే కాకుండా ఇందులో మరికొన్ని విషయాలను చాలా విభిన్నంగా చూపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది.అలాగే హీరో పాత్రను హైలెట్ చేసినట్టే అదే రేంజ్ లో సీత పాత్రను కూడా హైలెట్ చేయబోతున్నారని తెలుస్తుంది.
మరి చూడాలి ప్రేక్షకులకు సరికొత్త సీతను ఎలా ప్రెసెంట్ చేస్తార
.