చిత్రం, నువ్వునేను, మనసంతా నువ్వే సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న ఉదయ్ కిరణ్ ఆ తర్వాత నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదనే విషయం తెలిసిందే.ఎంతో భవిష్యత్తు ఉన్న ఉదయ్ కిరణ్ కొన్నేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుని వార్తల్లో నిలిచారు.
ఉదయ్ కిరణ్ నటించిన పలు సినిమాలకు వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో వీఎన్ ఆదిత్య ఉదయ్ కిరణ్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
శ్రీరామ్ సినిమా తర్వాత చిరంజీవి సినిమాకు ముహూర్తం జరిగి ఆగిపోయిందని వీఎన్ ఆదిత్య తెలిపారు.మలయాళ రీమేక్ ను చిరంజీవితో చేద్దామని తాను అనుకున్నానని ఆ కథ, ఇంద్ర కథకు పోలిక వచ్చిందని అందువల్ల ఆ సినిమా ఆగిపోయిందని వీఎన్ ఆదిత్య తెలిపారు.
నేనున్నాను సినిమా తర్వాత మళ్లీ ఛాన్స్ వచ్చిందని వీఎన్ ఆదిత్య పేర్కొన్నారు.కుర్ర హీరోల కంటే సీనియర్ హీరోలు కుమ్మేస్తున్నారని వీఎన్ ఆదిత్య చెప్పుకొచ్చారు.
శ్రీరామ్ సినిమా సమయంలో ఉదయ్ కిరణ్ కో డైరెక్టర్ ను తిట్టాడని వీఎన్ ఆదిత్య పేర్కొన్నారు.
డైరెక్టర్స్ ను ఒక్క మాట కూడా తప్పుగా అనకూడదని వేరే సినిమాలో వచ్చిన ఫ్రస్టేషన్ వల్ల ఉదయ్ కిరణ్ కో డైరెక్టర్ పై అరిచాడని వీఎన్ ఆదిత్య వెల్లడించారు.ఆ సమయంలో తాను ప్యాకప్ చెప్పి వచ్చానని వీఎన్ ఆదిత్య అన్నారు.ఉదయ్ కిరణ్ వేరే సినిమా రిలీజ్ విషయంలో ఇబ్బందులు ఎదురు కావడంతో ఉదయ్ ఆ విధంగా ప్రవర్తించాడని వీఎన్ ఆదిత్య తెలిపారు.
ప్రకాష్ రాజ్ ఒక సందర్భంలో అసిస్టెంట్ డైరెక్టర్ ను తిట్టాడని వీఎన్ ఆదిత్య చెప్పుకొచ్చారు.తన జీవితంలో ఇలాంటి సంఘటనలు కొన్ని జరిగాయని ఆదిత్య అన్నారు.ఉదయ్ చనిపోవడానికి కొన్నిరోజుల ముందు మూడు గంటలు మాట్లాడామని వీఎన్ ఆదిత్య వెల్లడించారు.