టాలీవుడ్ స్టార్ విలన్లలో అజయ్ ఒకరనే సంగతి తెలిసిందే.విజయవాడలో జన్మించిన అజయ్ విలన్ రోల్స్ ద్వారా పాపులారిటీని పెంచుకున్నారు.
విలన్ రోల్స్ తో పాటు పలు సినిమాల్లో సహాయక పాత్రల్లో కూడా అజయ్ నటించారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండటం వల్ల వేర్వేరు ప్రాంతాలకు బదిలీ కావడంతో అజయ్ వేర్వేరు ప్రాంతాలలో చదువుకున్నారు.
నటనపై ఉన్న ఆసక్తితో మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో అజయ్ కోర్సు పూర్తి చేశారు.
కౌరవుడు అనే సినిమాలో మొదట నటించిన అజయ్ కు ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో పెద్దగా ఆఫర్లు రాలేదు.
అయితే శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి సహాయంతో ఖుషి సినిమాలో ఆకతాయి పాత్రకు అజయ్ ఎంపికయ్యారు.ఆ తర్వాత ఒక్కడు సినిమా అజయ్ కెరీర్ కు ప్లస్ కావడంతో పాటు అజయ్ కు మరిన్ని ఆఫర్లు రావడానికి ఆ సినిమా కారణమైంది.
మహేష్ బాబు కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్టైన అతడు, పోకిరి సినిమాలలో కూడా అజయ్ నటించారు.
ఇష్క్ సినిమాకు అజయ్ కు ఉత్తమ సహాయనటుడిగా నంది అవార్డ్ దక్కింది.అజయ్ తన సినీ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.అయితే 19 సంవత్సరాల వయస్సులో ఈ నటుడు ఒక తుంటరి పని చేశాడు.
ఫ్రెండ్స్ తో కలిసి ఫ్యామిలీ మెంబర్స్ కు చెప్పకుండా నేపాల్ కు వెళ్లాడు.అయితే అక్కడ దాదాపుగా మూడు నెలలు ఉండటంతో ఖర్చుల కోసం అజయ్ తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి.
చేతిలో డబ్బులు లేకపోవడం డబ్బులు ఉంటే మాత్ర్మే భారత్ కు తిరిగివచ్చే పరిస్థితులు ఉండటంతో అజయ్ కు ఒక హోటల్ లో పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.డబ్బు సమకూర్చుకున్న తర్వాత అజయ్ ఇంటికి రావడం గమనార్హం.