తెలుగుతో పాటు ఇతర భాషల్లో 20,000కు పైగా పాటలు పాడి సింగర్ చిత్ర తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.మలయాళంలో సింగర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన చిత్ర తర్వాత కాలంలో ఇతర భారతీయ భాషల్లో కూడా పాటలు పాడారు.
చిత్ర తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కాగా చిత్రకు ఒక అక్క, ఒక తమ్ముడు ఉన్నారు.చిన్నప్పుడు టీచర్ కావాలని అనుకున్న చిత్ర గాయనిగా కెరీర్ ను మొదలుపెట్టి వరుసగా అవకాశాలను అందిపుచ్చుకున్నారు.
అమ్మ కూడా పాటలు బాగా పాడతారని అయితే అమ్మ కేవలం ఇంట్లో మాత్రమే పాటలు పాడతారని చిత్ర చెప్పుకొచ్చారు.తనది అరేంజ్డ్ మ్యారేజ్ అని తన భర్త ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పని చేసేవారని చిత్ర వెల్లడించారు.
బాలు గారు, జేసుదాసు గారి వల్లే తాను ప్రస్తుతం ఇంత గొప్ప స్థానంలో ఉన్నానని చిత్ర తెలిపారు.నానురు సింధు పాట కొరకు తనను పిలిచారని ఆ పాటకు తనకు జాతీయ అవార్డ్ కూడా వచ్చిందని చిత్ర చెప్పుకొచ్చారు.
తెలుగులో తాను పాటను తప్పుగా పాడగా ఎస్పీ బాలూ సరి చేశారని చిత్ర చెప్పారు.ఇళయరాజా గారు పాట రికార్డింగ్ జరిగే రోజునే ఏ సింగర్ ఆ పాట పాడాలో నిర్ణయం తీసుకుంటారని చిత్ర వెల్లడించారు.ఒకరోజు తాను రికార్డింగ్ కు ఆలస్యంగా వెళ్లానని ఇళయరాజా బాలసుబ్రహ్మణ్యం తన కొరకు వేచి చూస్తున్నారని ఇలా చేయడం బాగుందా అని అడగడంతో తనకు కన్నీళ్లు వచ్చి ఏడ్చేశానని చిత్ర పేర్కొన్నారు.
ఒకవైపు ఏడుపు వస్తుంటే మరోవైపు నవ్వుతూ ఆ పాటను పాడాల్సి వచ్చిందని చిత్ర అన్నారు.తాను అంతకుముందు కన్నీళ్లు పెట్టుకోవడం ఎప్పుడూ చూడలేదని ఇళయరాజా చెప్పారని చిత్ర అన్నారు.తనకు సుశీల, జానకి పాడిన పాటలు అంటే ఎంతో ఇష్టమని చిత్ర చెప్పుకొచ్చారు.