టాలీవుడ్ హీరోయిన్లలో కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్ గా సౌందర్యకు పేరుంది.గ్లామరస్ రోల్స్ చేస్తే మాత్రమే ఇండస్ట్రీలో హీరోయిన్ గా గుర్తింపు సొంతమవుతుందని ఇప్పటికీ భావించే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు.
అయితే సౌందర్య మాత్రం కేవలం అభినయంతోనే సినిమా ఇండస్ట్రీలో రాణించడం గమనార్హం.తక్కువ సమయంలోనే తన టాలెంట్ తో సౌందర్య స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకున్నారు.
కన్నడ నటి అయినప్పటికీ తన నటనతో సౌందర్య తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన సౌందర్య రైతు భారతం సినిమాతో తెలుగులో కెరీర్ ను మొదలుపెట్టారు.
అయితే తెలుగులో రిలీజైన సౌందర్య తొలి సినిమా మనవరాలి పెళ్లి కావడం గమనార్హం.రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, టాప్ హీరో, పెళ్లి పీటలు, ప్రేమకు వేళాయరా, మరికొన్ని సినిమాలలో సౌందర్య నటించారు.
యమలీల సినిమాలో ఛాన్స్ వచ్చినా కొన్ని రీజన్స్ వల్ల సౌందర్య ఆ ఛాన్స్ ను వదులుకున్నారు.
ఆమె తండ్రి సత్యనారాయణ జాతకం ప్రకారం ఆమె పేరును తర్వాత రోజుల్లో సౌందర్యగా మార్చారు.ఆమె జాతకం ప్రకారం 2004 సంవత్సరంలో కెరీర్ ఎండ్ అవుతుందని ఆమె తండ్రి చెప్పారు.ఆమె తండ్రి చెప్పిన విధంగానే జరగడం గమనార్హం.
అయితే ఆమె జీవితం ముగుస్తుందని ఎవరూ భావించలేదు.
చిరంజీవికి జోడీగా రిక్షావోడు, అన్నయ్య, చూడాలని ఉంది సినిమాలలో సౌందర్య నటించారు.బాలయ్యకు జోడీగా టాప్ హీరో సినిమాలో సౌందర్య నటించారు.వెంకీ, నాగార్జునలతో సౌందర్య ఎక్కువ సంఖ్యలో సినిమాల్లో నటించారు.
కామెడీ టచ్ ఉన్న పాత్రల్లో కొన్ని సినిమాల్లో సౌందర్య నటించడం గమనార్హం.నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా సౌందర్య కెరీర్ ను కొనసాగించారు.
హీరోయిన్ల గౌరవాన్ని పెంచే విధంగా సౌందర్య వ్యవహరించారు.సౌందర్య నటించి విడుదలైన చివరి సినిమా శివ్ శంకర్ కావడం గమనార్హం.