ఏ మాయ చేశావె సినిమాలో నాగచైతన్యకు జోడీగా నటించిన సమంత అప్పటినుంచి ఇప్పటివరకు తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీలలోని ప్రేక్షకులను తన నటనతో మాయ చేస్తోంది.నేడు స్టార్ హీరోయిన్ సమంత పుట్టినరోజు కాగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకముందు సమంత పాకెట్ మనీ కొరకు మోడలింగ్ చేశారు.
సినిమాలపై సమంతకు పెద్దగా ఆసక్తి లేకపోయినా ఆఫర్లు ఆమెను వెతుక్కుంటూ రావడం గమనార్హం.
ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ ఒక యాడ్ షూట్ లో చూసి సమంతను చూసి ఆమెకు ఏ మాయ చేశావె సినిమాలో అవకాశం ఇచ్చారు.
తెలుగులో ప్రభాస్ మినహా దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాలలో నటించిన సమంత తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.సమంత అసలు పేరు సమంత రుత్ ప్రభు కాగా కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రం ఆమెను యశోద అని పిలుస్తారని సమాచారం.
సమంత ప్రత్యూష అనే ఫౌండేషన్ ద్వారా తన వంతు సహాయం చేస్తున్నారు.తల్లిని స్పూర్తిగా తీసుకొని ప్రత్యూష్ ఫౌండేషన్ ను స్టార్ట్ చేసినట్టు సమంత పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే సమంత వ్యాపారాల్లో కూడా రాణిస్తున్నారు.ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు.ఈ సినిమాతో సమంత పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపును తెచ్చుకోనున్నారు.
తెలుగులో ప్రస్తుతం సమంత చేతిలో ఈ ఒక్క సినిమా మాత్రమే ఉంది.
పెళ్లి తర్వాత సమంత కథల ఎంపిక, పాత్రల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. శాకుంతలం 2022లో రిలీజ్ కానుండగా ఈ సినిమా కోసం సమంత ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు.