స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.ఎస్.జె సూర్య ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ఏఎం రత్నం ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.2001 సంవత్సరంలో విడుదలైన ఖుషి మూవీ యువత హృదయాలను గెలుచుకుంది.రొటీన్ కథే అయినా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ స్టేటస్ ను సొంతం చేసుకుంది.తమిళంలో ఖుషి సినిమాలో విజయ్, జ్యోతిక హీరోహీరోయిన్లుగా నటించారు.
తమిళంలో ఖుషి బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తెలుగులో ఈ సినిమాను అంతే గ్రాండ్ గా నిర్మించాలని ఈ సినిమా నిర్మాత ఎ.ఎం.రత్నం అనుకున్నారు.ఎస్ జె సూర్య పవన్ తో మాత్రమే ఈ సినిమాను తెరకెక్కించాలని భాష రాకపోయినా ఈ సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు.
ఖుషి సినిమాకు ముందు పవన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.అందువల్ల ఖుషి సినిమాపై సాధారణంగానే అంచనాలు భారీగా పెరిగాయి.
నిజానికి తమిళంలో ఖుషి విడుదల కాకముందే తెలుగులో ఖుషి సినిమా మొదలైంది.కానీ కొన్ని కారణాల వల్ల షూటింగ్ పూర్తి కాలేదు.ఆ తర్వాత తమిళంలో ఖుషి రిలీజ్ కావడం ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం జరిగాయి.సినిమా రిలీజైన తర్వాత ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది.
సాధారణ కథే అయినా కథనం ఆసక్తికరంగా ఉండటం వల్ల ఖుషి మూవీ సక్సెస్ సాధించింది.
సిద్ధూ పాత్రకు పవన్ కళ్యాణ్ ప్రాణం పోశారని చెప్పాలి.పవన్ ఆ పాత్రలో ఒదిగిపోయి పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.మధుమతి అలియాస్ బుజ్జి పాత్రకు భూమిక పూర్తిస్థాయిలో న్యాయం చేసి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.
తాజా వార్తలు