నటుడిగా, రచయితగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తోటపల్లి మధు గుర్తింపును సొంతం చేసుకున్నారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో తోటపల్లి మధు మాట్లాడుతూ శోభన్ బాబు రైటర్ నే డైలాగ్ చెప్పమంటారని చెప్పుకొచ్చారు.
శోభన్ బాబుకు తానంటే చాలా ఇష్టమని తోటపల్లి మధు కామెంట్లు చేశారు.శోభన్ బాబు ఎంతో క్రమశిక్షణతో ఉండేవారని తోటపల్లి మధు కామెంట్లు చేశారు.
డైలాగ్స్ ఎక్కువగా ఉంటే కెమెరామేన్ కు ఇబ్బందని శోభన్ బాబు అనేవారని తోటపల్లి మధు వెల్లడించారు.
సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే శోభన్ బాబు నటించేవారని తోటపల్లి మధు అన్నారు.
లైఫ్ లో పైకొస్తే రోజూ వడ, పాయసం తినాలని కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాల వల్ల శోభన్ బాబు అనుకున్నారని తోటపల్లి మధు తెలిపారు.శోభన్ బాబుకు పట్టుదల కూడా ఎక్కువని తోటమల్లి మధు కామెంట్లు చేశారు.
మదర్ థెరిసా ఫౌండేషన్ కు 5 కోట్ల రూపాయలు శోభన్ బాబు ప్రతి సంవత్సరం డొనేషన్ గా ఇచ్చేవారని తోటపల్లి మధు అన్నారు.
100 రూపాయలు ఇచ్చి ఎంతోమంది ప్రచారం చేసుకుంటారని శోభన్ బాబు మాత్రం భిన్నంగా ఉన్నారని తోటపల్లి మధు పేర్కొన్నారు.శోభన్ బాబు చనిపోతే 35,000 మంది ఏపీ నుంచి చెన్నైకు వెళ్లారని తోటపల్లి మధు వెల్లడించారు.శోభన్ బాబు చనిపోయిన రోజున భయంకరమైన వర్షం కురిసిందని తోటపల్లి మధు పేర్కొన్నారు.
శోభన్ బాబు ప్రతి అభిమానిని సొంత కుటుంబ సభ్యునిలా చూసుకునేవారని తోటపల్లి మధు చెప్పుకొచ్చారు.
కొన్ని వేల మందికి శోభన్ బాబు సహాయం చేశారని తోటపల్లి మధు తెలిపారు.1992లో తాను 22 సినిమాలకు కథలు రాశానని తోటపల్లి మధు చెప్పుకొచ్చారు.ఇన్ని సినిమా కథలను ఒకే సంవత్సరం రాయడం ఒక విధంగా రికార్డ్ అని తోటపల్లి మధు కామెంట్లు చేశారు.