వరుడు కావలెను సినిమాతో తాజాగా మరో హిట్ ను నాగశౌర్య ఖాతాలో వేసుకున్నారు.అయితే నిన్న రాత్రి నుంచి నాగ శౌర్యకు సంబంధించిన ఫామ్ హౌస్ లో పేకాటరాయుళ్లు అరెస్ట్ అయినట్టు ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
అయితే వాస్తవానికి ఈ వివాదం విషయంలో నాగశౌర్య తప్పు కానీ అతని కుటుంబ సభ్యుల తప్పు కానీ ఏ మాత్రం లేదని సమాచారం అందుతుండటం గమనార్హం.
నాగశౌర్య తండ్రితో పాటు ఆయన చిన్నాన్న గత కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు.
కొన్ని నెలల క్రితం నాగశౌర్య నాన్న, చిన్నాన్న వ్యాపార లావాదేవీల కోసం నగర శివార్లలో ఉన్న ఒక భవనంను అద్దెకు తీసుకున్నారు.అయితే నాగశౌర్య సినిమాలకు సంబంధించిన పనులతో బిజీగా ఉండటంతో శౌర్య కుటుంబ సభ్యులు ఆ భవనానికి సంబంధించిన తాళాలను వాచ్ మాన్ దగ్గర ఉంచినట్లు సమాచారం.
సాగర్ అనే వ్యక్తి నాగశౌర్య చిన్నాన్న నుంచి తాళాలను తీసుకున్నట్టు తెలుస్తోంది.
పార్టీ కోసం తాళాలను తీసుకున్న వ్యక్తులు అక్కడ పార్టీ చేసుకోవడంతో పాటు పేకాట ఆడినట్లు తెలుస్తోంది.ఈ సమాచారం పోలీసులకు చేరడంతో పోలీసులు రెయిడ్ చేసినట్లు తెలుస్తోంది.వాస్తవానికి నాగశౌర్యకు, అతని కుటుంబ సభ్యులకు సొంతంగా ఫామ్ హౌస్ లేదు.
అద్దెకు తీసుకున్న ఇంటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ వివాదం గురించి నాగశౌర్య స్పందించి వివరణ ఇస్తే బాగుంటుందనే కామెంట్లు సైతం ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్నాయి.వరుడు కావలెను ప్రమోషన్స్ లో భాగంగా నాగశౌర్య ఈ వార్తల గురించి స్పందిస్తారేమో చూడాల్సి ఉంది.త్వరలో నాగ శౌర్య నటించిన లక్ష్య మూవీ కూడా రిలీజ్ కానుంది.
ఈ సినిమాతో శౌర్య మరో సక్సెస్ అందుకుంటాడేమో చూడాల్సి ఉంది.